పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు

- April 18, 2024 , by Maagulf
పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు

యూఏఈ: యూఏఈలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిసిన తర్వాత, ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో ఎమిరేట్స్ అల్లాడిపోతున్నది. ఈ నేపథ్యంలో పౌరులు మరియు నివాసితుల భద్రతే దేశం యొక్క ప్రధాన ప్రాధాన్యత అని,  దేశంలోని మౌలిక సదుపాయాలపై అధ్యయనం చేయాలని యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆదేశించారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల ప్రభావితమైన అన్ని కుటుంబాలకు సహాయం అందించాలని ఆదేశించారు. స్థానిక అధికారుల సహకారంతో ప్రభావితమైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా ప్రజలందరి భద్రత కోసం తక్షణ చర్యలు చేపట్టాలని ఒక ప్రకటన విడుదల చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com