140 గంటల్లో ఐదు దేశాలు.. 45 కార్యక్రమాల్లో పాల్గొన్నా మోదీ
- June 06, 2016
భారత ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తాను దృఢమైన వ్యక్తి అని నిరూపించుకున్నారు. భారత దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం తనదైన ముద్రను వేసుకున్న ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. 140గంటల్లో ఆయన ఐదు దేశాలు చుట్టేశారు. దాదాపు 33 వేల కిలో మీటర్లు ప్రయాణించారు.ప్రస్తుతం అమెరికాలో ఉన్న మోదీ కేవలం అలుపులేకుండా 140 గంటల్లో ఐదు దేశాలు చుట్టేయడం చెప్పుకోదగిన విషయమే. అంతేకాకుండా, ఈ ఐదు దేశాల్లో ఆయన దాదాపు 45 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 44 గంటలపాటు విమానంలో ప్రయాణించారు. మోదీ తిరిగి ఢిల్లీలో ఈ నెల పదిన ఉదయం 5గంటలకు అడుగుపెట్టనున్నారు. 'ఐదు దేశాలు, 45కు పైగా సమావేశాలు..అది ఇక్కడ కావొచ్చు.. విదేశాల్లో కావొచ్చు.. నేను దేశం కోసమే పనిచేస్తున్నాను' అని మోదీ గత ఆదివారం దోహాలో చెప్పిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







