140 గంటల్లో ఐదు దేశాలు.. 45 కార్యక్రమాల్లో పాల్గొన్నా మోదీ
- June 06, 2016భారత ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తాను దృఢమైన వ్యక్తి అని నిరూపించుకున్నారు. భారత దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం తనదైన ముద్రను వేసుకున్న ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. 140గంటల్లో ఆయన ఐదు దేశాలు చుట్టేశారు. దాదాపు 33 వేల కిలో మీటర్లు ప్రయాణించారు.ప్రస్తుతం అమెరికాలో ఉన్న మోదీ కేవలం అలుపులేకుండా 140 గంటల్లో ఐదు దేశాలు చుట్టేయడం చెప్పుకోదగిన విషయమే. అంతేకాకుండా, ఈ ఐదు దేశాల్లో ఆయన దాదాపు 45 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 44 గంటలపాటు విమానంలో ప్రయాణించారు. మోదీ తిరిగి ఢిల్లీలో ఈ నెల పదిన ఉదయం 5గంటలకు అడుగుపెట్టనున్నారు. 'ఐదు దేశాలు, 45కు పైగా సమావేశాలు..అది ఇక్కడ కావొచ్చు.. విదేశాల్లో కావొచ్చు.. నేను దేశం కోసమే పనిచేస్తున్నాను' అని మోదీ గత ఆదివారం దోహాలో చెప్పిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్