దిల్ రాజు - త్రివిక్రమ్ లు ఓ చిత్రానికి శ్రీకారం చుట్టారు..
- June 07, 2016
అటు ప్రేమ కథలు ఇష్టపడే యువతను ఇటు కుటుంబ కథా చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కథలను రూపొందించుకుని, వాటిని చక్కటి చిత్రాలుగా మలచటంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ది అందెవేసిన చేయి. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన 'అ.. ఆ' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. మరోవైపు దిల్ రాజు నిర్మించే చిత్రాలు ఆ కోవకు చెందినవే. ఇప్పుడు వీరిద్దరూ ఒక్కటై ఓ చిత్రానికి శ్రీకారం చుట్టారు. దీని గురించి దిల్ రాజు మాట్లాడుతూ ''త్రివిక్రమ్ శ్రీనివాస్తో నాకు 'నువ్వే కావాలి' సినిమా రోజుల నుండి మంచి స్నేహం ఉంది. సినిమాల గురించి ఎన్నో విషయాలను చర్చించుకుంటూ ఉండేవాళ్ళం.
ఇప్పుడు మా బ్యానర్లో ఆయనతో ఒక భారీ సినిమా తేయబోతున్నాం. ఒక పెద్ద స్టార్ హీరోతో ఈ చిత్రం ఉంటుందని, ఇతర వివరాలను తరువాత ప్రకటిస్తాం'' అని ఆయన తెలిపారు. అ..ఆ చిత్రం విజయం గురించి మాట్లాడుతూ, "జూన్లో పెద్ద సినిమా సక్సెస్ అయిన చరిత్ర లేదు. అటువంటి ట్రెండ్ని కూడా ఈ చిత్రం బ్రేక్ చేసింది. కేవలం ఒక వారంలో డిస్ట్రిబ్యూటర్స్కు డబ్బులు తిరిగి రావటం అనేది ఈ మధ్య కాలంలో ఏ సినిమాకీ జరగలేదు. ఇంతటి విజయాన్ని అందుకున్న త్రివిక్రమ్కి, నిర్మాత చినబాబు గారికి నా అభినందనలు" అని అన్నారు.
తాజా వార్తలు
- వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం
- ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్









