విజయవాడ 'మినీ ధియేటర్' చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభం
- June 07, 2016
ఎంతో ప్రతిష్టాత్మకంగా విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభమైన 'మినీ ధియేటర్'లో మొదటి షో కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా 1200 రూపాయలు పెట్టి టికెట్లు కొనుగోలు చేసారు. అయితే ఇంత మొత్తం వెచ్చించి, ఇంతకీ ఏ సినిమా చూసారంటే. గతేడాది టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టిన 'శ్రీమంతుడు' సినిమా!
ఆ సినిమా విడుదలైన సమయంలోనే 'శ్రీమంతుడు'ను చూసిన చంద్రబాబు, మరోసారి 'వై స్క్రీన్' ప్రారంభం సందర్భంగా వీక్షించారు. దేశంలోనే ఆర్టీసీ బస్టాండ్ లో తొలి థియేటర్ గా రికార్డులకు ఎక్కిన 'వై స్క్రీన్'లో తొలి తాంబూలం మహేష్ బాబు 'శ్రీమంతుడు'కు దక్కింది.మొత్తం సినిమాను వీక్షించడానికి సమయం లేకపోయినా, కాసేపు చూసిన తర్వాత అమరావతికి పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, శిద్ధా రాఘవరావు, అధికారుల టికెట్లు కూడా చంద్రబాబు నాయుడే కొనుగోలు చేసారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







