విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA
- April 23, 2024న్యూఢిల్లీ: విమానయాన సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు వారికి అదే పీఎన్ఆర్ నంబర్పై ప్రయాణిస్తున్న తల్లిదండ్రులు లేదా సంరక్షకుల్లో ఒకరి పక్కన సీటు కేటాయించాలని సూచించింది. ఫ్లైట్స్ల్లో కొన్నిసార్లు పేరెంట్స్తో కాకుండా చిన్నారులకు వేరుగా సీటు కేటాయిస్తున్న ఉదంతాల నేపథ్యంలో డీజీసీఏ ఈ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు నిబంధనలు సవరిస్తూ సర్క్యూలర్ జారీ చేసింది.
అలాగే దీనికి సంబంధించిన రికార్డులను కూడా నిర్వహించాలని ఆదేశించింది. దీంతో పాటు ఎయిర్లైన్లకు సంబంధించి కొన్ని వెసులుబాట్లు కూడా కల్పించడం జరిగింది. సీట్ల ప్రాధాన్యం, సంగీత వాయిద్య పరికరాలు తీసుకెళ్లడం, జీరో బ్యాగేజీ, మీల్స్, డ్రింక్స్, స్నాక్స్ వంటి వాటికి ఫీజులు వసూలు చేసుకోవచ్చని తెలిపింది. అయితే, ఈ రుసుములు ఐచ్ఛికంగా ఉండాలని, తప్పనిసరి చేయకూడదని స్పష్టం చేసింది. సాధారణంగా విమానాల్లో వెబ్ చెక్-ఇన్ ఆప్షన్ ఉంటుంది. ఆ సమయంలో ప్రయాణికుడు తమకు నచ్చిన సీటును ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ ఏ సీటూ ఎంచుకోకపోతే వారికి ఆటో సీట్ అసైన్మెంట్ రూల్ వర్తిస్తుందని ఈ సందర్భంగా డీజీసీఏ గుర్తు చేసింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు