విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA
- April 23, 2024
న్యూఢిల్లీ: విమానయాన సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు వారికి అదే పీఎన్ఆర్ నంబర్పై ప్రయాణిస్తున్న తల్లిదండ్రులు లేదా సంరక్షకుల్లో ఒకరి పక్కన సీటు కేటాయించాలని సూచించింది. ఫ్లైట్స్ల్లో కొన్నిసార్లు పేరెంట్స్తో కాకుండా చిన్నారులకు వేరుగా సీటు కేటాయిస్తున్న ఉదంతాల నేపథ్యంలో డీజీసీఏ ఈ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు నిబంధనలు సవరిస్తూ సర్క్యూలర్ జారీ చేసింది.
అలాగే దీనికి సంబంధించిన రికార్డులను కూడా నిర్వహించాలని ఆదేశించింది. దీంతో పాటు ఎయిర్లైన్లకు సంబంధించి కొన్ని వెసులుబాట్లు కూడా కల్పించడం జరిగింది. సీట్ల ప్రాధాన్యం, సంగీత వాయిద్య పరికరాలు తీసుకెళ్లడం, జీరో బ్యాగేజీ, మీల్స్, డ్రింక్స్, స్నాక్స్ వంటి వాటికి ఫీజులు వసూలు చేసుకోవచ్చని తెలిపింది. అయితే, ఈ రుసుములు ఐచ్ఛికంగా ఉండాలని, తప్పనిసరి చేయకూడదని స్పష్టం చేసింది. సాధారణంగా విమానాల్లో వెబ్ చెక్-ఇన్ ఆప్షన్ ఉంటుంది. ఆ సమయంలో ప్రయాణికుడు తమకు నచ్చిన సీటును ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ ఏ సీటూ ఎంచుకోకపోతే వారికి ఆటో సీట్ అసైన్మెంట్ రూల్ వర్తిస్తుందని ఈ సందర్భంగా డీజీసీఏ గుర్తు చేసింది.
తాజా వార్తలు
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!
- తప్పుడు లింక్పై క్లిక్.. సైబర్ సెక్యూరిటీ నిపుణుల హెచ్చరిక..!!
- దొంగిలించిన క్రెడిట్ కార్డుల కొనుగోలుపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు









