విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA
- April 23, 2024
న్యూఢిల్లీ: విమానయాన సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు వారికి అదే పీఎన్ఆర్ నంబర్పై ప్రయాణిస్తున్న తల్లిదండ్రులు లేదా సంరక్షకుల్లో ఒకరి పక్కన సీటు కేటాయించాలని సూచించింది. ఫ్లైట్స్ల్లో కొన్నిసార్లు పేరెంట్స్తో కాకుండా చిన్నారులకు వేరుగా సీటు కేటాయిస్తున్న ఉదంతాల నేపథ్యంలో డీజీసీఏ ఈ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు నిబంధనలు సవరిస్తూ సర్క్యూలర్ జారీ చేసింది.
అలాగే దీనికి సంబంధించిన రికార్డులను కూడా నిర్వహించాలని ఆదేశించింది. దీంతో పాటు ఎయిర్లైన్లకు సంబంధించి కొన్ని వెసులుబాట్లు కూడా కల్పించడం జరిగింది. సీట్ల ప్రాధాన్యం, సంగీత వాయిద్య పరికరాలు తీసుకెళ్లడం, జీరో బ్యాగేజీ, మీల్స్, డ్రింక్స్, స్నాక్స్ వంటి వాటికి ఫీజులు వసూలు చేసుకోవచ్చని తెలిపింది. అయితే, ఈ రుసుములు ఐచ్ఛికంగా ఉండాలని, తప్పనిసరి చేయకూడదని స్పష్టం చేసింది. సాధారణంగా విమానాల్లో వెబ్ చెక్-ఇన్ ఆప్షన్ ఉంటుంది. ఆ సమయంలో ప్రయాణికుడు తమకు నచ్చిన సీటును ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ ఏ సీటూ ఎంచుకోకపోతే వారికి ఆటో సీట్ అసైన్మెంట్ రూల్ వర్తిస్తుందని ఈ సందర్భంగా డీజీసీఏ గుర్తు చేసింది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









