యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- April 23, 2024అబుదాబి: హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సోమవారం అబుదాబిలోని కసర్ అల్ వతన్ (నేషన్ ప్యాలెస్)లో అధికారిక చర్చలు నిర్వహించారు. ఎమిరెట్స్ మరియు ఒమన్ సుల్తానేట్ మధ్య సంబంధాలు చరిత్రలో నిలిచి పోయినట్లు సుల్తాన్ తెలిపారు. రెండు దేశాలు బలమైన కుటుంబ బంధాలు, సహకారం మరియు ఏకీకరణతో కూడిన ప్రత్యేక సామాజిక మరియు సాంస్కృతిక అనుబంధాన్ని కలిగి ఉన్నాయన్నారు. ఈ బంధం రెండు దేశాల ప్రయోజనాలకు ఉపయోగపడే స్థిరమైన మరియు ఆదర్శప్రాయమైన సంబంధాలకు పునాదులుగా నిలుస్తుందని, పురోగతి మరియు శ్రేయస్సు కోసం వారి ప్రజల ఆకాంక్షలను సాధించగలదని విశ్వసిస్తున్నట్టు తెలిపారు. ఆర్థిక అవకాశాలను అన్వేషించడానికి, రెండు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం వాటిని అభివృద్ధి చేయడానికి ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. సెషన్లో ఇరువురు నాయకులు రెండు ప్రజల ప్రయోజనాలకు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ రంగాలలో ఇప్పటికే ఉన్న సహకారం, వాటిని ప్రోత్సహించే మార్గాల గురించి చర్చించారు. చర్చల సెషన్ తర్వాత హిస్ మెజెస్టి ది సుల్తాన్ ఖాసర్ అల్ వతన్ (ప్యాలెస్ ఆఫ్ ది నేషన్) వద్ద సీనియర్ విజిటర్స్ బుక్పై సంతకం చేశారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..