సింగపూర్ ఆఫీస్ టవర్ని కొనుగోలు చేయనున్న ఖతార్ ఫండ్
- June 07, 2016
కతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ది సావరీన్ వెల్త్ ఫండ్ ఆఫ్ ది మిడిల్ ఈస్టర్న్ కంట్రీ, బ్లాక్ రాక్ ఐఎన్సికి చెందిన ఏసియా స్క్వేర్ టవర్ 1 ని 2.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ఇది సింగపూర్లో అతి పెద్ద ఆఫీస్ ట్రాన్జాక్షన్. ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ మరియు బ్లాక్ రాక్ సోమవారం దీనికి సంబంధించి స్పష్టతనిచ్చాయి. సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్లో అతి పెద్ద సింగిల్ టవర్ని ఈ రీజియన్లో ఖతార్ సొంతం చేసుకోనుంది. 43 అంతస్తులు కలిగిన ఈ టవర్ అమ్మకం విషయంలో బ్లాక్రాక్, మార్కెట్ రేటు కంటే తక్కువ రేటుకే ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీకి ఇవ్వనుంది. సింగపూర్ మార్కెట్లో డౌన్ ట్రెండ్ నడుస్తుండడంతో ఈ ఏడాది, వచ్చే ఏడాది కూడా కార్యాలయాల అద్దెలు తగ్గవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చాలా కార్యాలయాలు అమ్మకాల కోసం ముందుకొస్తున్నాయని, అయితే డిమాండ్ మాత్రం యధాతథంగా ఉందని వారంటున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







