హైవే ప్రమాదంలో 15 మంది మృతి
- June 07, 2016
సౌదీ హైవేలో రమదాన్ మాసం తొలి రోజున జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. సాయంత్రం 5.52 నిమిషాల సమయంలో ప్రమాదానికి సంబంధించిన సమాచారం తమకు అందిందని ఎడ్ క్రిసెంట్ ప్రతినిథి అబ్దుల్లా అల్ మురైబైద్ చెప్పారు. తక్షణం ప్రమాద స్థలికి డాక్టర్ల బృందాన్ని పంపించామని, అప్పటికే 15 మంది చనిపోగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారనీ, 14 మంది ఓ మోస్తరు గాయాలు, 11 మందికి తేలికపాటి గాయాలు అయ్యాయని, క్షతగాత్రులకు ప్రాథమిక సహాయం అందించి, ఆసుపత్రులకు తరలించామని అధికారులు చెప్పారు. ప్రమాదంలో మృతి చెందినవారిలో ఎక్కువమంది విదేశీయులే ఉన్నారు. రహదారిపై వాహనాల్ని నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ ఎంతగా అవగాహన కల్పిస్తున్నా, రోడ్లపై ప్రమాదాలు తగ్గడంలేదని అధికారులు చెప్పారు. ప్రమాదాల్ని అరికట్టేందుకు తాము ఎన్ని చర్యలు తీసుకున్నా, వాహనదారులు అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదాలు ఆపలేమని వారు వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







