హైవే ప్రమాదంలో 15 మంది మృతి
- June 07, 2016
సౌదీ హైవేలో రమదాన్ మాసం తొలి రోజున జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. సాయంత్రం 5.52 నిమిషాల సమయంలో ప్రమాదానికి సంబంధించిన సమాచారం తమకు అందిందని ఎడ్ క్రిసెంట్ ప్రతినిథి అబ్దుల్లా అల్ మురైబైద్ చెప్పారు. తక్షణం ప్రమాద స్థలికి డాక్టర్ల బృందాన్ని పంపించామని, అప్పటికే 15 మంది చనిపోగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారనీ, 14 మంది ఓ మోస్తరు గాయాలు, 11 మందికి తేలికపాటి గాయాలు అయ్యాయని, క్షతగాత్రులకు ప్రాథమిక సహాయం అందించి, ఆసుపత్రులకు తరలించామని అధికారులు చెప్పారు. ప్రమాదంలో మృతి చెందినవారిలో ఎక్కువమంది విదేశీయులే ఉన్నారు. రహదారిపై వాహనాల్ని నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ ఎంతగా అవగాహన కల్పిస్తున్నా, రోడ్లపై ప్రమాదాలు తగ్గడంలేదని అధికారులు చెప్పారు. ప్రమాదాల్ని అరికట్టేందుకు తాము ఎన్ని చర్యలు తీసుకున్నా, వాహనదారులు అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదాలు ఆపలేమని వారు వివరించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









