హైదరాబాద్ వేదికగా 18న ఫిల్మ్ఫేర్ వేడుకలు
- June 07, 2016
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా అందజేసే ఫిల్మ్ఫేర్ పురస్కారాలకు ఈ ఏడాది హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. 63వ ఫిల్మ్ఫేర్ పురస్కారాల వేడుకను హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ఈనెల 18న నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి సినీనటి రకుల్ ప్రీత్సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ఫిల్మ్ఫేర్ వివరాలను వెల్లడించారు. ఫిల్మ్ఫేర్ పురస్కారాల్లో తనకు చోటు దక్కడంపై రకుల్ ఆనందం వ్యక్తం చేశారు.
ఏటా నాలుగు భాషల నటీనటుల మధ్య బంధాన్ని ఈ పురస్కారాలు మరింత బలోపేతం చేస్తున్నాయని పేర్కొన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ తారలంతా హాజరుకానున్న ఈ వేడుకకు పెద్దయెత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 10 విభాగాల్లో ఓటింగ్ ద్వారా పురస్కారానికి ఎంపిక చేయనున్నారు. టాలీవుడ్ నుంచి ఉత్తమ చిత్రాలుగా బాహుబలి, భలే భలే మగాడివోయ్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, కంచె, శ్రీమంతుడు చిత్రాలు పోటీ పడుతున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







