హైదరాబాద్ వేదికగా 18న ఫిల్మ్ఫేర్ వేడుకలు
- June 07, 2016
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా అందజేసే ఫిల్మ్ఫేర్ పురస్కారాలకు ఈ ఏడాది హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. 63వ ఫిల్మ్ఫేర్ పురస్కారాల వేడుకను హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ఈనెల 18న నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి సినీనటి రకుల్ ప్రీత్సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ఫిల్మ్ఫేర్ వివరాలను వెల్లడించారు. ఫిల్మ్ఫేర్ పురస్కారాల్లో తనకు చోటు దక్కడంపై రకుల్ ఆనందం వ్యక్తం చేశారు.
ఏటా నాలుగు భాషల నటీనటుల మధ్య బంధాన్ని ఈ పురస్కారాలు మరింత బలోపేతం చేస్తున్నాయని పేర్కొన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ తారలంతా హాజరుకానున్న ఈ వేడుకకు పెద్దయెత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 10 విభాగాల్లో ఓటింగ్ ద్వారా పురస్కారానికి ఎంపిక చేయనున్నారు. టాలీవుడ్ నుంచి ఉత్తమ చిత్రాలుగా బాహుబలి, భలే భలే మగాడివోయ్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, కంచె, శ్రీమంతుడు చిత్రాలు పోటీ పడుతున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









