హైవే ప్రమాదంలో 15 మంది మృతి
- June 07, 2016
సౌదీ హైవేలో రమదాన్ మాసం తొలి రోజున జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. సాయంత్రం 5.52 నిమిషాల సమయంలో ప్రమాదానికి సంబంధించిన సమాచారం తమకు అందిందని ఎడ్ క్రిసెంట్ ప్రతినిథి అబ్దుల్లా అల్ మురైబైద్ చెప్పారు. తక్షణం ప్రమాద స్థలికి డాక్టర్ల బృందాన్ని పంపించామని, అప్పటికే 15 మంది చనిపోగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారనీ, 14 మంది ఓ మోస్తరు గాయాలు, 11 మందికి తేలికపాటి గాయాలు అయ్యాయని, క్షతగాత్రులకు ప్రాథమిక సహాయం అందించి, ఆసుపత్రులకు తరలించామని అధికారులు చెప్పారు. ప్రమాదంలో మృతి చెందినవారిలో ఎక్కువమంది విదేశీయులే ఉన్నారు. రహదారిపై వాహనాల్ని నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ ఎంతగా అవగాహన కల్పిస్తున్నా, రోడ్లపై ప్రమాదాలు తగ్గడంలేదని అధికారులు చెప్పారు. ప్రమాదాల్ని అరికట్టేందుకు తాము ఎన్ని చర్యలు తీసుకున్నా, వాహనదారులు అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదాలు ఆపలేమని వారు వివరించారు.
తాజా వార్తలు
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- 13 సంస్థలపై SR37 మిలియన్ల జరిమానా..!!
- రెండు దేశాలతో ఎయిర్ సర్వీసులకు సుల్తాన్ ఆమోదం..!!
- కువైట్ లో కొత్త రెసిడెన్సీ ఉల్లంఘన జరిమానాలు..!!
- ICRF ఫేబర్-కాస్టెల్ స్పెక్ట్రమ్ క్యాలెండర్ 2026 ఆవిష్కరణ..!!
- దుబాయ్ లో ఆ 4 బీచ్లు ఫ్యామిలీల కోసమే..!!
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..







