ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- April 25, 2024మస్కట్: డిజిటల్ ద్వారా భూ లావాదేవీలను సులభతరం చేయడానికి గృహనిర్మాణ మరియు పట్టణ ప్రణాళికా మంత్రిత్వ శాఖ 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' సేవను ప్రారంభించింది. హౌసింగ్ మరియు అర్బన్ ప్లానింగ్ మంత్రిత్వ శాఖ తన ప్రతిష్టాత్మకమైన 'సంపన్న సమాజాల కోసం స్థిరమైన పట్టణ అభివృద్ధి' కి అనుగుణంగా తన సేవలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుందని వెల్లడించింది. ప్రభుత్వ భూమి మంజూరు వ్యవస్థతో సహా అన్ని సేవలను డిజిటటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వ భూములను మంజూరు చేయడానికి సంబంధించి రాయల్ డిక్రీ నం. (42/2021) జారీ చేసినప్పటి నుండి, ప్రభుత్వ నివాస ప్లాట్ల కోసం అర్హులైన పౌరులకు వివిధ గృహాలను అందించడానికి మంత్రిత్వ శాఖ ఆసక్తిగా ఉందని, ఈ ఎంపిక ప్రక్రియలో కుటుంబాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. 2023లో 25,000 కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు దీని నుండి లబ్ది పొందారని, దీని తర్వాత "ఓన్ యువర్ ల్యాండ్" వంటి అనేక హౌసింగ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయని, ఇది ఇంటరాక్టివ్ ద్వారా సమగ్ర సేవలతో విశిష్టమైన ప్లాన్లు మరియు లొకేషన్లలో ప్రభుత్వ-సబ్సిడీ ధరకు భూమిని పొందేందుకు లబ్ధిదారుని అనుమతిస్తుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?