ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- April 25, 2024
మస్కట్: డిజిటల్ ద్వారా భూ లావాదేవీలను సులభతరం చేయడానికి గృహనిర్మాణ మరియు పట్టణ ప్రణాళికా మంత్రిత్వ శాఖ 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' సేవను ప్రారంభించింది. హౌసింగ్ మరియు అర్బన్ ప్లానింగ్ మంత్రిత్వ శాఖ తన ప్రతిష్టాత్మకమైన 'సంపన్న సమాజాల కోసం స్థిరమైన పట్టణ అభివృద్ధి' కి అనుగుణంగా తన సేవలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుందని వెల్లడించింది. ప్రభుత్వ భూమి మంజూరు వ్యవస్థతో సహా అన్ని సేవలను డిజిటటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వ భూములను మంజూరు చేయడానికి సంబంధించి రాయల్ డిక్రీ నం. (42/2021) జారీ చేసినప్పటి నుండి, ప్రభుత్వ నివాస ప్లాట్ల కోసం అర్హులైన పౌరులకు వివిధ గృహాలను అందించడానికి మంత్రిత్వ శాఖ ఆసక్తిగా ఉందని, ఈ ఎంపిక ప్రక్రియలో కుటుంబాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. 2023లో 25,000 కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు దీని నుండి లబ్ది పొందారని, దీని తర్వాత "ఓన్ యువర్ ల్యాండ్" వంటి అనేక హౌసింగ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయని, ఇది ఇంటరాక్టివ్ ద్వారా సమగ్ర సేవలతో విశిష్టమైన ప్లాన్లు మరియు లొకేషన్లలో ప్రభుత్వ-సబ్సిడీ ధరకు భూమిని పొందేందుకు లబ్ధిదారుని అనుమతిస్తుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు