తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- April 25, 2024హైదరాబాద్: భారత దేశ వ్యాప్తంగా ప్రతి రోజు రోడ్డు ప్రమాదాలు అనేవి అనేకం జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది కన్నుమూస్తున్నారు. తాజాగా తెలంగాణ లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 10 మంది యువకులు కన్నుమూశారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు సూర్యపేట జిల్లా కోదాడ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నందునే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
మరో ప్రమాదం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగింది. నలుగురు ఇంటర్ విద్యార్థులు ఒకే బైక్పై ఇల్లందు నుంచి వర్ధన్నపేట వెళ్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. వీరి మరణంతో వీరి కుటుంబాల్లో విషాదం నెలకొంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ