తెలంగాణలో తీవ్ర వడగాలులు..
- April 25, 2024హైదరాబాద్: తెలంగాణలో భానుడు భగభగమంటున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు, వేడి గాలుల తీవ్రత కొనసాగుతోంది. మరో వారం రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదు అవుతాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
పలు జిల్లాలకు వడగాలుల ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ్ నారాయణ్ పేట్, జోగులాంబ గద్వాల, వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదారాబాద్ వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి మాట్లాడుతూ.. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పగటి పూట ఉష్ణోగ్రతలో అనూహ్య మార్పులు వచ్చాయన్నారు. గరిష్టంగా సాధారణంగా కన్నా మూడు డిగ్రీలకు పైగా పెరిగాయని చెప్పారు. ఈనెల చివరి వారంలో అక్కడక్కడా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి