మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- April 25, 2024రియాద్: మే 14, 15 తేదీల్లో "గ్రేట్ ఫ్యూచర్స్" వాణిజ్య ప్రదర్శనను రియాద్ వేదికగా నిర్వహించనున్నారు. సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వాలు ఈ ఎక్స్పోను నిర్వహిస్తున్నాయి. ఇది వ్యాపారం, పర్యాటకం మరియు సాంస్కృతిక రంగాలలో భాగస్వామ్యాన్ని పెంచనుంది. బ్రిటీష్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఒలివర్ డౌడెన్ 350 మంది బ్రిటీష్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. రియాద్లోని కింగ్ అబ్దుల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో జరిగే రెండు రోజుల ఫ్లాగ్షిప్ ఈవెంట్లో దాదాపు 750 మంది ప్రతినిధులు పాల్గొంటారు. బ్రిటిష్ ప్రతినిధి బృందంలో 350 మందికి పైగా ప్రభుత్వ అధికారులు, బ్రిటిష్ వ్యాపార రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తులు ఉంటారు. సౌదీ-బ్రిటీష్ వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ప్రయత్నాలలో భాగంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంపొందించడంతో పాటు అనేక ఆశాజనక రంగాలలో ఇరుపక్షాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ ట్రేడ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు వాణిజ్య మంత్రి డాక్టర్ మజేద్ అల్-కసాబీ తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా