అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- April 25, 2024
న్యూఢిల్లీ: భారత దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందన్న అమెరికా రిపోర్ట్ను భారత్ గురువారం తిరస్కరించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ వారంలో నిర్వహించే మీడియా సమావేశంలో ఈ నివేదికపై మీడియా ప్రశ్నించింది. ఈ నివేదిక తీవ్ర పక్షపాతంతో కూడుకున్నదని, దేశంపై సరైన అవగాహన లేదనడానికి నిదర్శనమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఆరిపోర్టుకు ఎటువంటి విలువ లేదని, మీరు కూడా పట్టించుకోవద్దని మీడియాకు సూచించారు.
గతేడాది మణిపూర్లో హింసాకాండ చెలరేగిన తర్వాత తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ”2023 కంట్రీ రిపోర్ట్స్ ఆన్ హ్యూమన్ రైట్స్ ప్రాక్టీసెస్: ఇండియా ” పేరిట ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. మైతేయి, కుకీ కమ్యూనిటీల మధ్య చెలరేగిన ఘర్షణలో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆ నివేదికలో పేర్కొంది. ఈ ఘటనను ప్రధాని మోడీ సిగ్గు చేటని అభివర్ణించడంతో పాటు నివేదికపై విచారణకు ఆదేశించారని పేర్కొంది. జమ్ముకాశ్మీర్లో జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు విచారణను ఎదుర్కొన్నట్లు పలు నివేదికలు స్పష్టం చేశాయని తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







