సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- April 26, 2024
మనామా: బహ్రెయిన్ దిగువ క్రిమినల్ కోర్టు ఒక ప్రభుత్వ సంస్థను, ప్రత్యేకించి విద్యా మంత్రిత్వ శాఖపై విమర్శలు చేసిన ఉపాధ్యాయునికి BD100 జరిమానా విధించింది. తన పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అవమానకరమైన వ్యాఖ్యలు, మంత్రిత్వ శాఖపై ప్రత్యక్ష దాడితో కూడిన వీడియో క్లిప్ను పోస్ట్ చేసినట్లు ప్రాసిక్యూటర్ సాక్ష్యాలను సమర్పించింది. గత 20 సంవత్సరాలుగా మంత్రిత్వ శాఖ 'లోపభూయిష్ట విద్యార్థులను' తయారు చేసిందని సదరు ఉపాధ్యాయుడు చేసిన వ్యాఖ్యలు గ్రాడ్యుయేట్లకు తీవ్ర నష్టం కలిగించిందని మంత్రిత్వ శాఖ కోర్టుకు తెలిపింది. వాదనలు విన్న కోర్టు.. మంత్రిత్వ శాఖ వాదనకు మద్దతుగా నిలిచింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు