ఈ రామాయణం అంత ఆషా మాషీ కాదండోయ్.!
- April 27, 2024
రామాయణంపై ఇప్పటికే చాలా సినిమాలొచ్చేశాయ్. కొన్ని సూపర్ హిట్టు.. కొన్ని ఓ మాదిరి హిట్టు.. లేటెస్ట్ మూవీ ‘ఆది పురుష్’ అయితే అట్టర్ ఫ్లాప్.. ఇదీ రామాయణంకి చెందిన మూవీ హిస్టరీ.
అయినా కానీ, రామాయణంపై సినిమాలు తెరకెక్కించాలన్న ఆసక్తి తగ్గడం లేదు మన మేకర్లకి. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి ఈ జనరేషన్కి అర్ధమయ్యేలా ఓ రామాయణం తెరకెక్కించబోతున్నాడు.
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్, టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి.. రాముడు, సీత పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ నటుడు ‘కేజీఎఫ్’ హీరో యష్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడు.
అంతా బాగానే వుంది. కానీ, ఇటీవల ‘ఆది పురుష్’ సినిమా చూశాకా.. ఎలాంటి అనుభూతులు పొందారో సినీ ప్రేక్షకులు తెలిసిన సంగతే. సో, రామాయణం అనే కాన్సెప్ట్ టచ్ చేయాలంటే.. చాలా చాలా జాగ్రత్తగా వుండాలి. నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ రామాయణం ఎలా అలరించబోతోందో.. కానీ, అంచనాలయితే బాగానే వున్నాయ్. సినిమా సోదిలో నిలుస్తోంది. ఇక లేటెస్ట్గా షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని ఫోటోలు కూడా లీక్ అయిపోయాయ్.
రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసినట్లుగా కనిపిస్తోంది ఈ పిక్స్ చూస్తుంటే. మరి, కథ, కధనాలు నడిపిన తీరును బట్టి సినిమా రిజల్ట్ బేస్ అయ్యి వుంటుంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









