ఓటీటీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిపోయిన ‘మంజుమ్మల్ బాయ్స్’.!
- May 07, 2024
ఈ మధ్యనే ధియేటర్లలో రిలీజ్ అయిన ఈ మలయాళ డబ్బింగ్ చిత్రాన్ని రిలీజ్కి ముందు తెలుగులోనూ బాగా ప్రమోట్ చేశారు. అయితే, ధియేటర్లలో అంతంత మాత్రమే ఆకట్టుకున్పప్పటికీ, రీసెంట్గా ఓటీటీలోకొచ్చిన ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్ని కట్టి పడేస్తోంది.
మంజుమ్మల్ అనే ఊరికి చెందిన పది మంది స్నేహితుల సరదా ట్రిప్ నేపథ్యం చుట్టూ సాగే ఈ సినిమా ప్రతి ఒక్కరినీ కదిలించింది. యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ధియేటర్లలోనూ ఈ సినిమా బాగానే వసూళ్లు కొల్లగొట్టిందని అంటున్నారు.
టెక్నికల్గా రిచ్గా అంతే నేచురల్గా రూపొందిన ఈ చిత్రానికి బడ్జెట్ చాలా తక్కువే. కానీ, వసూళ్లు మాత్రం ఊహించని విధంగా వచ్చాయట. తమిళనాడులో ఈ సినిమాకి బ్యాన్ విధించినా మిగిలిన చోట్ల మంచి వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
ఇక, ఓటీటీ ఆడియన్స్ అయితే, ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతున్నారు. ఆసక్తికరమైన కథనంతో అంతులేని ఎమోషన్తో కట్టి పడేసిన ఈ చిత్రం నిజంగానే ఓ అద్భుత దృశ్య కావ్యంగా అభివర్ణించొచ్చేమో. ఎటువంటి గ్లామర్ లేదు. కమర్షియల్ అంశాలు అసలే లేవు. కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే. అది కూడా ఎమోషన్తో కట్టిపడేసేలా.! ఓటీటీలో అందుబాటులో వుంది కనుక, ఒక్కసారైనా ఈ చిత్రం చూసి తీరాల్సిందే.!
తాజా వార్తలు
- ఉద్యోగులకు గుడ్ న్యూస్..జులై 15 నుండి కొత్త హెల్త్ స్కీమ్!
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!







