ఓటీటీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిపోయిన ‘మంజుమ్మల్ బాయ్స్’.!
- May 07, 2024
ఈ మధ్యనే ధియేటర్లలో రిలీజ్ అయిన ఈ మలయాళ డబ్బింగ్ చిత్రాన్ని రిలీజ్కి ముందు తెలుగులోనూ బాగా ప్రమోట్ చేశారు. అయితే, ధియేటర్లలో అంతంత మాత్రమే ఆకట్టుకున్పప్పటికీ, రీసెంట్గా ఓటీటీలోకొచ్చిన ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్ని కట్టి పడేస్తోంది.
మంజుమ్మల్ అనే ఊరికి చెందిన పది మంది స్నేహితుల సరదా ట్రిప్ నేపథ్యం చుట్టూ సాగే ఈ సినిమా ప్రతి ఒక్కరినీ కదిలించింది. యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ధియేటర్లలోనూ ఈ సినిమా బాగానే వసూళ్లు కొల్లగొట్టిందని అంటున్నారు.
టెక్నికల్గా రిచ్గా అంతే నేచురల్గా రూపొందిన ఈ చిత్రానికి బడ్జెట్ చాలా తక్కువే. కానీ, వసూళ్లు మాత్రం ఊహించని విధంగా వచ్చాయట. తమిళనాడులో ఈ సినిమాకి బ్యాన్ విధించినా మిగిలిన చోట్ల మంచి వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
ఇక, ఓటీటీ ఆడియన్స్ అయితే, ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతున్నారు. ఆసక్తికరమైన కథనంతో అంతులేని ఎమోషన్తో కట్టి పడేసిన ఈ చిత్రం నిజంగానే ఓ అద్భుత దృశ్య కావ్యంగా అభివర్ణించొచ్చేమో. ఎటువంటి గ్లామర్ లేదు. కమర్షియల్ అంశాలు అసలే లేవు. కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే. అది కూడా ఎమోషన్తో కట్టిపడేసేలా.! ఓటీటీలో అందుబాటులో వుంది కనుక, ఒక్కసారైనా ఈ చిత్రం చూసి తీరాల్సిందే.!
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







