ఓటీటీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిపోయిన ‘మంజుమ్మల్ బాయ్స్’.!
- May 07, 2024
ఈ మధ్యనే ధియేటర్లలో రిలీజ్ అయిన ఈ మలయాళ డబ్బింగ్ చిత్రాన్ని రిలీజ్కి ముందు తెలుగులోనూ బాగా ప్రమోట్ చేశారు. అయితే, ధియేటర్లలో అంతంత మాత్రమే ఆకట్టుకున్పప్పటికీ, రీసెంట్గా ఓటీటీలోకొచ్చిన ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్ని కట్టి పడేస్తోంది.
మంజుమ్మల్ అనే ఊరికి చెందిన పది మంది స్నేహితుల సరదా ట్రిప్ నేపథ్యం చుట్టూ సాగే ఈ సినిమా ప్రతి ఒక్కరినీ కదిలించింది. యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ధియేటర్లలోనూ ఈ సినిమా బాగానే వసూళ్లు కొల్లగొట్టిందని అంటున్నారు.
టెక్నికల్గా రిచ్గా అంతే నేచురల్గా రూపొందిన ఈ చిత్రానికి బడ్జెట్ చాలా తక్కువే. కానీ, వసూళ్లు మాత్రం ఊహించని విధంగా వచ్చాయట. తమిళనాడులో ఈ సినిమాకి బ్యాన్ విధించినా మిగిలిన చోట్ల మంచి వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
ఇక, ఓటీటీ ఆడియన్స్ అయితే, ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతున్నారు. ఆసక్తికరమైన కథనంతో అంతులేని ఎమోషన్తో కట్టి పడేసిన ఈ చిత్రం నిజంగానే ఓ అద్భుత దృశ్య కావ్యంగా అభివర్ణించొచ్చేమో. ఎటువంటి గ్లామర్ లేదు. కమర్షియల్ అంశాలు అసలే లేవు. కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే. అది కూడా ఎమోషన్తో కట్టిపడేసేలా.! ఓటీటీలో అందుబాటులో వుంది కనుక, ఒక్కసారైనా ఈ చిత్రం చూసి తీరాల్సిందే.!
తాజా వార్తలు
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!
- ప్రయాణీకులను హెచ్చరించిన HIA, ఖతార్ ఎయిర్వేస్..!!
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్









