'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- May 16, 2024
యూఏఈ: గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ సమగ్రతను కాపాడటంలో అత్యంత సీరియస్గా ఉన్నట్లు యూఏఈ ప్రకటించింది. ఇటీవల మనీ లాండరింగ్పై పోరాడుతున్న అంతర్జాతీయ సంస్థ నుండి ప్రశంసలు కూడా పొందినట్లు యూఏఈ అధికారి ఒకరు వెల్లడించారు. "ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ నేరస్థులలో కొంతమందికి సురక్షితమైన స్వర్గధామంగా దుబాయ్ ఉంది. కొంతవరకు దాని రియల్ ఎస్టేట్ రంగం అందించే గోప్యత కారణంగా" అని పేర్కొన్న ఒక నివేదికను తీవ్రంగా తప్పుబట్టారు. గ్లోబల్ క్రిమినల్స్ అని పిలవబడే వారిని అడ్డుకోవడంలో యూఏఈ ముందువరుసలో ఉంటుందన్నారు. ఫిబ్రవరిలో (ఈ సంవత్సరం), మనీలాండరింగ్తో పోరాడటానికి ప్రపంచ ప్రమాణాలను నిర్దేశించే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (FATF) ప్రశంసించిందని తెలిపారు. యూఏఈ అమలు చేయబడిన చట్టపరమైన నిబంధనల ప్రకారమే దుబాయ్ లో ఆస్తుల కొనుగోలు ప్రతిపాదనపై సంతకం చేసినప్పుడు అతను/ఆమె తన పాస్పోర్ట్ కాపీలు మరియు ఎమిరేట్స్ IDతో సహా అతని/ఆమె అన్ని పత్రాలను అందించాలి. తాము కొనుగోలుదారు యొక్క గుర్తింపు మరియు వారి నిధుల మూలానికి సంబంధించిన సమాచారాన్ని మరియు డిపాజిట్ కోసం చెల్లింపును కఠినంగా పరిశీలిస్తామని అజీజీ డెవలప్మెంట్స్ సీఈఓ ఫర్హాద్ అజీ వెల్లడించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!