ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- May 17, 2024
యూఏఈ: మీరు ఆన్లైన్లో విక్రయిస్తున్న కారు లేదా బ్యాగ్ కోసం కొనుగోలుదారుడు సంప్రదించాడా? నకిలీ బ్యాంకు రశీదులు పంపే మోసగాళ్ల పట్ల జాగ్రత్త వహించాలని పోలీసులు తెలిపారు. ఆన్లైన్ అమ్మకందారులను లక్ష్యంగా చేసుకున్న స్కామ్ గురించి అబుదాబి పోలీసులు శుక్రవారం నివాసితులను అప్రమత్తం చేశారు. ఈ బూటకపు కొనుగోలుదారులు సాధారణంగా 'రసీదులను' పంపుతారని, వారు ఇప్పటికే డబ్బును పంపినట్లు చెబుతారని, కానీ చెల్లింపు చేయరని తేలిందని క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ డైరెక్టర్ కల్నల్ మస్లిం ముహమ్మద్ అల్ అమరీ తెలిపారు. డబ్బు అందే వరకు వస్తువులను ఇవ్వవద్దని కల్నల్ అల్ అమరీ విక్రేతలను కోరారు. ఇలాంటి మోసాలకు పాల్పడిన వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అబుదాబిలో ఉన్నవారు టోల్-ఫ్రీ హాట్లైన్ 8002626 (AMAN2626) లేదా SMS (2828) ద్వారా లేదా [email protected] ae కి ఇ-మెయిల్ పంపడం ద్వారా పోలీసులను సంప్రదించవచ్చు. ఫిర్యాదుదారులు పోలీసుల అధికారిక యాప్ను కూడా ఉపయోగించవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!