మోదీ విదేశీ పర్యటన ముగిసింది...

- June 09, 2016 , by Maagulf
మోదీ విదేశీ పర్యటన ముగిసింది...

విదేశీ పర్యటనలు ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం భారత్ కు తిరుగు పయనం అయ్యారు. ఆయన అయిదు రోజుల్లో ఐదు దేశాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నెల 4వ తేదీన మోదీ విదేశీ పర్యటనకు వెళ్లారు. ముందుగా ఆఫ్గనిస్తాన్ పర్యటించారు. ఆ తర్వాత ఖతార్, స్విట్జర్లాండ్, అమెరికాతో పాటు చివరిగా మెక్సికోలో పర్యటించారు.మోదీ పర్యటన వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ గురువారం ట్విట్ చేశారు. కాగా ఐదు దేశాల పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ తీరిక లేకుండా గడిపారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఆయా దేశాలతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com