హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- May 19, 2024
విశాఖపట్నం: విశాఖ పోలీసులు హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేశారు. విదేశాల్లో ఉద్యోగాల పేరిట కంబోడియా దేశానికి మానవ అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే, కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ దేశాలకి భారత్ నుంచి ఉద్యోగాల పేరిట హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు నిందితులు.
విశాఖ సీపీ రవి శంకర్ మాట్లాడారు. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఏపీ నుంచి 150 మందిని హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారని చెప్పారు. మొత్తం దాదాపు 5 వేల మంది వివిధ దేశాల్లో యువత వారి చేతిలో ఉన్నారని తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఫెడ్ ఎక్స్, టాస్క్ గేమ్ పేరిట సైబర్ నేరాలు చెయ్యడంలో ఈ అమాయకులని వాడుకుంటున్నారని తెలిపారు.
ఇక్కడ నుంచి కంబోడియాకి వీరిని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని, నిరుద్యోగుల వద్ద నుంచి లక్షన్నర వరకు వసూలు చేశారని చెప్పారు. 80 వేల రూపాయలను కంబోడియా దేశంలో ఏజెంట్ కి ఇస్తారని తెలిపారు. ఆన్ లైన్ స్కాంలు చేయాలని వీరికి ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పారు.
అన్నం పెట్టకుండా కూడా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. రాజేశ్ వినయ్ కుమార్ పేరిట చీఫ్ ఏజెంట్ ఉన్నాడని చెప్పారు. చైనాకి ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ కి లింక్స్ ఉన్నాయని తెలిపారు. ఈ స్కాంలో హనీ ట్రాప్ కూడా ఉందని, అమ్మాయిలను నగ్నంగా కూడా చూపిస్తున్నారని చెప్పారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!