మ్యాంగో ప్రాన్స్
- June 09, 2016
కావలసిన పదార్థాలు : పచ్చిరొయ్యలు (శుభ్రం చేసినవి) - అరకేజీ, మామిడికాయలు - 2, కారం - రెండు టీ స్పూన్లు, ధనియాలపొడి - 1 టీ స్పూను, మిరియాలపొడి - అర టీ స్పూను, గరంమసాలా పొడి -1 టీ స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - అరకప్పు, ఉల్లిగడ్డలు - 2, పచ్చిమిర్చి - 3, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం : రొయ్యలకు కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాలపొడి, ఉప్పు బాగా కలిపి పక్కనుంచుకోవాలి. మామిడికాయల్ని ఉడికించి గుజ్జుని గ్రైండ్ చేసిపెట్టుకోవాలి. కడాయిలో నూనె వేసి ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి తర్వాత రొయ్యల్ని కూడా కలిపి సన్నని సెగమీద వేగనివ్వాలి. మామిడి గుజ్జుని కలిపి (కావాలనుకుంటే తగినంత నీరు చేర్చండి) నీరంతా ఇగిరిపోయాక దించేముందు మసాలాపొడి, కొత్తిమీరను చల్లుకోవాలి.
తాజా వార్తలు
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!
- ఖతార్లో నెలరోజుల్లో QR18.626 బిలియన్ల లావాదేవీలు..!!
- సౌదీ అరేబియాలో భూకంపం.. యూఏఈలో ప్రభావమెంతంటే?
- కువైట్ లో వేర్వేరు కేసుల్లో ఆరుగురి అరెస్ట్..!!
- రియాద్ ఎక్స్పో 2030.. కింగ్ హమద్ కు ఆహ్వానం..!!
- రోడ్డుపై ట్రక్కు బోల్తా..ప్రయాణికులకు అలెర్ట్..!!
- Insta TV యాప్ను విడుదల చేసిన మెటా
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్







