ప్రీ-అప్రూవ్డ్ వీసా ఆన్ అరైవల్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి..!
- May 25, 2024
దుబాయ్: యూకే లేదా యూరోపియన్ యూనియన్ దేశాలలో సాధారణ పాస్పోర్ట్ కలిగి, అమెరికా గ్రీన్ కార్డ్ లేదా నివాస వీసాను కలిగి ఉన్న భారతీయులు యూఏఈకి వచ్చేందుకు వీసా-ఆన్-అరైవల్ను పొందేందుకు తప్పనిసరిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. స్వల్పకాలిక వీసాను ఒక సారి మాత్రమే మరో 14 రోజులు పొడిగించవచ్చని దుబాయ్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) పేర్కొంది. అర్హత కలిగిన భారతీయ ప్రయాణికులకు కొన్ని సంవత్సరాలుగా యూఏఈ విమానాశ్రయాలలో వీసా ఆన్ అరైవల్ మంజూరు చేయబడుతోంది. ప్రయాణికులు తమ విమానాల నుండి దిగిన తర్వాత వీసా సాధారణంగా ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద స్టాంప్ చేస్తున్నారు. ఇప్పుడు, దుబాయ్కి వెళ్లే ప్రయాణికులు ముందుగా సర్వీస్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రీ-అప్రూవ్డ్ వీసా ఆన్ అరైవల్కు అర్హులైన భారతీయ పర్యాటకులు ముందుగా GDRFA వెబ్సైట్ https://smart.gdrfad.gov.ae కి లాగిన్ అవ్వాలి. వారు తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేసుకోవాలి. రుసుము కింద Dh253 చెల్లించాలి. 48 గంటల్లో ఆమోదం పొందిన తర్వాత, వీసా వినియోగదారు ఇమెయిల్కు పంపబడుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఎమిరేట్స్ ఎయిర్లైన్లో తమ ప్రయాణాన్ని బుక్ చేసుకున్న కొంతమంది భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లకు ప్రీ-అప్రూవ్డ్ వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని ప్రకటించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







