క్షమాభిక్ష పథకం.. జూన్ 17 తర్వాత ఇంటెన్సివ్ సెక్యూరిటీ చెక్..!
- May 25, 2024
కువైట్: రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు దేశం విడిచి వెళ్లడానికి లేదా వారి హోదాను చట్టబద్ధం చేయడానికి కొనసాగుతున్న క్షమాభిక్ష వ్యవధిని ఉపయోగించుకోవాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది. గడువు ముగిసిన తర్వాత రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్ట్ చేసి, వారిని బహిష్కరించనున్నట్లు ఒక ట్వీట్లో మంత్రిత్వ శాఖ తెలిపింది. గతంలో, కువైట్ క్షమాభిక్ష వ్యవధిని ప్రకటించింది. ఇది జూన్ 17తో ముగుస్తుంది. ఉల్లంఘించినవారు తమ స్థితిని చట్టపరమైన ఫ్రేమ్వర్క్ల ద్వారా జూన్ 17 గడువులోపు సవరించుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత, మంత్రిత్వ శాఖ సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేయనుంది. పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు దేశంలోకి తిరిగి ప్రవేశించడానికి వీలు లేకుండా బహిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







