క్షమాభిక్ష పథకం.. జూన్ 17 తర్వాత ఇంటెన్సివ్ సెక్యూరిటీ చెక్..!
- May 25, 2024
కువైట్: రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు దేశం విడిచి వెళ్లడానికి లేదా వారి హోదాను చట్టబద్ధం చేయడానికి కొనసాగుతున్న క్షమాభిక్ష వ్యవధిని ఉపయోగించుకోవాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది. గడువు ముగిసిన తర్వాత రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్ట్ చేసి, వారిని బహిష్కరించనున్నట్లు ఒక ట్వీట్లో మంత్రిత్వ శాఖ తెలిపింది. గతంలో, కువైట్ క్షమాభిక్ష వ్యవధిని ప్రకటించింది. ఇది జూన్ 17తో ముగుస్తుంది. ఉల్లంఘించినవారు తమ స్థితిని చట్టపరమైన ఫ్రేమ్వర్క్ల ద్వారా జూన్ 17 గడువులోపు సవరించుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత, మంత్రిత్వ శాఖ సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేయనుంది. పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు దేశంలోకి తిరిగి ప్రవేశించడానికి వీలు లేకుండా బహిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









