క్షమాభిక్ష పథకం.. జూన్ 17 తర్వాత ఇంటెన్సివ్ సెక్యూరిటీ చెక్..!
- May 25, 2024
కువైట్: రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు దేశం విడిచి వెళ్లడానికి లేదా వారి హోదాను చట్టబద్ధం చేయడానికి కొనసాగుతున్న క్షమాభిక్ష వ్యవధిని ఉపయోగించుకోవాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది. గడువు ముగిసిన తర్వాత రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్ట్ చేసి, వారిని బహిష్కరించనున్నట్లు ఒక ట్వీట్లో మంత్రిత్వ శాఖ తెలిపింది. గతంలో, కువైట్ క్షమాభిక్ష వ్యవధిని ప్రకటించింది. ఇది జూన్ 17తో ముగుస్తుంది. ఉల్లంఘించినవారు తమ స్థితిని చట్టపరమైన ఫ్రేమ్వర్క్ల ద్వారా జూన్ 17 గడువులోపు సవరించుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత, మంత్రిత్వ శాఖ సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేయనుంది. పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు దేశంలోకి తిరిగి ప్రవేశించడానికి వీలు లేకుండా బహిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు







