బేబీ కేర్ హాస్పిటల్లో అగ్నిప్రమాదం...ఆరుగురు శిశువులు మృతి
- May 26, 2024
న్యూ ఢిల్లీ : ఢిల్లీలోని వివేక్ విహార్లోని న్యూ బోర్న్ బేబీ కేర్ హాస్పిటల్లో శనివారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు.
ఢిల్లీ అగ్నిమాపక శాఖ ప్రకారం, ప్రమాదంలో చిక్కుకున్న మొత్తం 12 మంది పిల్లలనుల్లో ఆరుగురు మరణించారు. ఒకరు వెంటిలేటర్పై ఉండగా, ఐదుగురు ఆసుపత్రిలో చేరారు. రక్షించబడిన నవజాత శిశువులను తూర్పు ఢిల్లీ అడ్వాన్స్ ఎన్ఐసియు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక అధికారి రాజేష్ మాట్లాడుతూ… "రాత్రి 11:32 గంటలకు ఆసుపత్రిలో మంటలు చెలరేగినట్లు సమాచారం అందింది. మొత్తం 16 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశాయి. 2 భవనాలు మంటలకు దెబ్బతిన్నాయి. ఒకటి ఆసుపత్రి భవనం మరియు కుడి వైపున ఉన్న నివాస భవనం యొక్క 2 అంతస్తులు కూడా మంటల్లో చిక్కుకున్నాయి. 11-12 మందిని రక్షించి వారిని ఆసుపత్రికి తరలించారని" తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!