యూఏఈ-ఇండియా విమానాలు రద్దు
- May 26, 2024
యూఏఈ: మే 26, 27 యూఏఈ-ఇండియా మధ్య అనేక విమానాలు రద్దు చేశారు. రెమల్ తుఫాను కారణంగా మే 26 ఉదయం 12 గంటల నుండి మే 27 ఉదయం 9 గంటల వరకు అన్ని విమాన కార్యకలాపాలను 21 గంటల పాటు నిలిపివేయాలని కోల్కతా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకున్నది. కోల్కతాతో సహా పశ్చిమ బెంగాల్ తీరప్రాంతంపై తుఫాను ప్రభావం చూపుతుందని అంచనా వేశారు. కోల్కతాలో భారీ గాలులు మరియు భారీ నుండి అతి భారీ వర్షపాతం కారణంగా విమాన కార్యకలాపాలు 21 గంటలపాటు నిలిపివేయబడ్డాయని కోల్కతా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
అబుదాబి జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం (AUH) నుండి కోల్కతా సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం (CCU)కి ఎతిహాద్ ఎయిర్వేస్ విమానం EY256 మరియు ఆదివారం (మే 26) తిరుగు ప్రయాణంలో EY257 ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రద్దు చేయబడినట్లు ఎయిర్లైన్ ప్రతినిధి ధృవీకరించారు.
దుబాయ్-కోల్కతా మధ్య విమానాలు కూడా దెబ్బతిన్నాయి. మే 26న EK 572/573 మరియు మే 27న EK570/571 విమానాలను రద్దు చేసినట్లు ఎమిరేట్స్ ప్రతినిధి ధృవీకరించారు. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ (DXB) మరియు CCU మధ్య FZ 461/462 విమానాలు ఆలస్యం అయ్యాయి. మే 27 న నడపనున్నట్లు ఫ్లైదుబాయ్ ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







