యూఏఈ-ఇండియా విమానాలు రద్దు
- May 26, 2024
యూఏఈ: మే 26, 27 యూఏఈ-ఇండియా మధ్య అనేక విమానాలు రద్దు చేశారు. రెమల్ తుఫాను కారణంగా మే 26 ఉదయం 12 గంటల నుండి మే 27 ఉదయం 9 గంటల వరకు అన్ని విమాన కార్యకలాపాలను 21 గంటల పాటు నిలిపివేయాలని కోల్కతా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకున్నది. కోల్కతాతో సహా పశ్చిమ బెంగాల్ తీరప్రాంతంపై తుఫాను ప్రభావం చూపుతుందని అంచనా వేశారు. కోల్కతాలో భారీ గాలులు మరియు భారీ నుండి అతి భారీ వర్షపాతం కారణంగా విమాన కార్యకలాపాలు 21 గంటలపాటు నిలిపివేయబడ్డాయని కోల్కతా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
అబుదాబి జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం (AUH) నుండి కోల్కతా సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం (CCU)కి ఎతిహాద్ ఎయిర్వేస్ విమానం EY256 మరియు ఆదివారం (మే 26) తిరుగు ప్రయాణంలో EY257 ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రద్దు చేయబడినట్లు ఎయిర్లైన్ ప్రతినిధి ధృవీకరించారు.
దుబాయ్-కోల్కతా మధ్య విమానాలు కూడా దెబ్బతిన్నాయి. మే 26న EK 572/573 మరియు మే 27న EK570/571 విమానాలను రద్దు చేసినట్లు ఎమిరేట్స్ ప్రతినిధి ధృవీకరించారు. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ (DXB) మరియు CCU మధ్య FZ 461/462 విమానాలు ఆలస్యం అయ్యాయి. మే 27 న నడపనున్నట్లు ఫ్లైదుబాయ్ ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









