యూఏఈ గోల్డెన్ వీసా..మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం
- May 28, 2024
దుబాయ్: యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసిన భారతీయుల జాబితాలో మెగాస్టార్ చిరంజీవి చేరారు. తాజాగా యూఏఈ సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ టాలీవుడ్ మెగాస్టార్కు ఎంతో ప్రతిష్టాత్మకమైన 10 సంవత్సరాల యూఏఈ గోల్డెన్ వీసాను మంజూరు చేసింది. ఇటీవల రజనీకాంత్ కు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసిన విషయం తెలిసిందే.
యూఏఈ ప్రభుత్వం మొదటిసారిగా 2019లో గోల్డెన్ వీసా కాన్సెప్ట్ తీసుకొచ్చింది. స్పాన్సర్ అవసరం లేకుండా దేశంలో నివసించడానికి, పని చేయడానికి మరియు చదువుకోవడానికి ఈ గోల్డెన్ వీసా వీలు కల్పిస్తుంది. వీసా హోల్డర్లు యూఏఈ ప్రధాన భూభాగంలో వారి వ్యాపారాలపై 100 శాతం మేనేజ్మెంట్ హక్కును కలిగి ఉంటారు. ఐదు లేదా 10 సంవత్సరాల కాలానికి ఉండే ఈ వీసాలు ఆటోమెటిగ్గా పునరుద్ధరించబడతాయి. చిరంజీవి కంటే ముందు, మెగా ఫ్యామిలీ కోడలు మరియు నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని తోపాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగా కుటుంబంలో ఈ వీసాను అందుకున్నారు. అయితే, తాజాగా చిరంజీవికి దక్కిన గౌరవం పట్ల యావత్ భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. షారుఖ్ ఖాన్, సంజయ్ దత్, సోనూ సూద్, రణ్ వీర్ సింగ్, సానియా మీర్జా, సిరాశ్రీ మరియు మౌని రాయ్ ఇప్పటకే ఈ యూఏఈ గోల్డెన్ వీసాలను అందుకున్నారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!