యూఏఈ గోల్డెన్ వీసా..మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం
- May 28, 2024
దుబాయ్: యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసిన భారతీయుల జాబితాలో మెగాస్టార్ చిరంజీవి చేరారు. తాజాగా యూఏఈ సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ టాలీవుడ్ మెగాస్టార్కు ఎంతో ప్రతిష్టాత్మకమైన 10 సంవత్సరాల యూఏఈ గోల్డెన్ వీసాను మంజూరు చేసింది. ఇటీవల రజనీకాంత్ కు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసిన విషయం తెలిసిందే.
యూఏఈ ప్రభుత్వం మొదటిసారిగా 2019లో గోల్డెన్ వీసా కాన్సెప్ట్ తీసుకొచ్చింది. స్పాన్సర్ అవసరం లేకుండా దేశంలో నివసించడానికి, పని చేయడానికి మరియు చదువుకోవడానికి ఈ గోల్డెన్ వీసా వీలు కల్పిస్తుంది. వీసా హోల్డర్లు యూఏఈ ప్రధాన భూభాగంలో వారి వ్యాపారాలపై 100 శాతం మేనేజ్మెంట్ హక్కును కలిగి ఉంటారు. ఐదు లేదా 10 సంవత్సరాల కాలానికి ఉండే ఈ వీసాలు ఆటోమెటిగ్గా పునరుద్ధరించబడతాయి. చిరంజీవి కంటే ముందు, మెగా ఫ్యామిలీ కోడలు మరియు నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని తోపాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగా కుటుంబంలో ఈ వీసాను అందుకున్నారు. అయితే, తాజాగా చిరంజీవికి దక్కిన గౌరవం పట్ల యావత్ భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. షారుఖ్ ఖాన్, సంజయ్ దత్, సోనూ సూద్, రణ్ వీర్ సింగ్, సానియా మీర్జా, సిరాశ్రీ మరియు మౌని రాయ్ ఇప్పటకే ఈ యూఏఈ గోల్డెన్ వీసాలను అందుకున్నారు.
తాజా వార్తలు
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!









