ఒమన్‌లోని భారతీయ ప్రవాసుల కీలక డాక్యుమెంట్స్ డిజిటలైజ్..!

- May 28, 2024 , by Maagulf
ఒమన్‌లోని భారతీయ ప్రవాసుల కీలక డాక్యుమెంట్స్ డిజిటలైజ్..!

మస్కట్:  1838 నాటి డాక్యుమెంట్ అయినా, 1927 నాటి ట్రేడ్ డాక్యుమెంట్ అయినా, లేదా 1961లో ఇండియన్ ఎంబసీ ఈవెంట్‌కి ఆహ్వానం అయినా, 19వ మరియు 20వ శతాబ్దపు తొలిదశకు చెందిన వందలాది పత్రాలు మస్కట్‌లోని ఇండియన్ ఎంబసీలో గత పది రోజులుగా స్కాన్ చేసి సేవ్ చేయబడ్డాయి.డిజిటలైజ్ చేయబడిన పత్రాలు ఆర్కైవ్ చేయబడి, NAI యొక్క డిజిటల్ పోర్టల్ అయిన 'అభిలేఖ్ పాటల్'లో అప్‌లోడ్ చేశారు.ఈ పత్రాలు పరిశోధకులకు మరియు విస్తృత ప్రజలకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

అదే విధంగా భారతీయ/భారత సంతతి కుటుంబాలు అయిన రతాన్సీ పురుషోతమ్ కుటుంబం, ఖిమ్జీ రాందాస్ కుటుంబం, హరిదాస్ నెన్సే కుటుంబం, భాంజీ హరిదాస్ ముండ్రావల్లా కుటుంబం, నారాయణదాస్ మరియు శాంత తోప్రానీ కుటుంబం, మగన్‌లాల్ మంజీ వ్యాస్ కుటుంబం, విజయ్ సింగ్ వెల్జీ పావని కుటుంబం వేద్ కుటుంబం, చిమన్‌లాల్ ఛోటాలాల్ సూర్తి కుటుంబం, జయంతిలాల్ వాధర్ కుటుంబం, కనోజియా కుటుంబం, రమేష్ ఖిమ్జీ కుటుంబం, విసూమల్ దామోదరదాస్ కుటుంబం, విజయ్ సింగ్ పురుషోతమ్ తోప్రానీ కుటుంబం, జమ్నాదాస్ కేశవ్‌జీ కుటుంబం, నారంజీ హిర్జీ కుటుంబం, వెల్జీ అర్జున్ పావని కుటుంబం, పురుషోతం దామోదర్ కుటుంబం, పాండ్య కుటుంబం, పాండ్య కుటుంబం నెన్షి కుటుంబం, షా నాగర్‌దాస్ మాంజీ కుటుంబం, అజిత్ ఖిమ్జీ కుటుంబం, ఖతౌ రతాన్సీ తోప్రానీ కుటుంబం, రతన్షి గోర్ధన్‌దాస్ బజారియా కుటుంబం, హర్షేందు హస్ముఖ్ షా కుటుంబం, ఖుబో గుర్నానీ కుటుంబం, మోహన్‌లాల్ అర్జున్ పావని కుటుంబం, ధంజీ మొరాజీ “షబికా” కుటుంబం, ఎబ్జీ సుందర్‌దాస్ అషర్, ఢరాంసే, ద్హరమ్సే కిరణ్ అషేర్ కుటుంబం, మరియు బకుల్ మెహతా కుటుంబం వారివి ప్రైవేట్ సేకరణలు డిజిటలైజ్ చేయబడ్డాయని  NAI డైరెక్టర్ జనరల్ అరుణ్ సింఘాల్ తెలియజేశారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టితో ఈ ప్రాజెక్ట్ చేపట్టామని,ఒమన్‌లోని భారతీయ సమాజ చరిత్రను డాక్యుమెంట్ చేయడం మరియు సంరక్షించడం ద్వారా తాము ఒక ముఖ్యమైన భాగాన్ని పునరుజ్జీవింపజేస్తున్నామని నారంగ్ వెల్లడించారు. అలాగే ఒమన్‌లోని భారతీయ కమ్యూనిటీ అధిపతి షేక్ అనిల్ ఖిమ్‌జీ ఈ ప్రాజెక్ట్‌ను ప్రశంసించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com