ఏపీలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

- May 29, 2024 , by Maagulf
ఏపీలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

అమరావతి: ఏపీలో జూన్ 4న ఓట్ల లెక్కింపునకు ప్రధాన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఆరోజు రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలను ప్రకటిస్తామన్నారు. ఈ మేరకు ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ కు వివరించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా.

సీఈవో ముకేశ్ కుమార్ మీనా..
”ఈ నెల 4న ఓట్ల లెక్కింపునకు పక్కాగా ఏర్పాట్లు. రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు వెలువడే విధంగా చర్యలు. 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్లలోపు మధ్యాహ్నం 2 గంటల్లోగా ఫలితాల వెల్లడి. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లలో సాయంత్రం నాలుగు గంటల్లోగా ఫలితాలు వెల్లడి. మూడు నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైగా లెక్కింపుతో సాయంత్రం 6 గంటల్లోగా రిజల్ట్స్ వెల్లడి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ఆలస్యం కాకుండా టేబుల్స్ పెంపు”.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com