ఆంధ్రప్రదేశ్లో కుమ్మేస్తున్న కూటమి..
- June 04, 2024
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఎదురులేకుండా దూసుకుపోతోంది. వైసీపీకు పలు నియోజకవర్గాల్లో ఓటర్లు గట్టి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే మెజార్టీ స్థానాలను దాటి ఎన్డీఏ కూటమి దూకుడు ప్రదర్శిస్తోంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ భారీ మెజార్టీ దిశగా సాగుతున్నారు. లోక్సభ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది. వెలువడుతున్న ఫలితాలతో కూటమి శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఇప్పటికే 103కుపైగా స్థానాల్లో టీడీపీ...14 కుపైగా స్థానాల్లో జనసేన.. మూడు స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా... వైసీపీ కేవలం 2 స్థానాల్లోనే ముందంజలో ఉంది. ఫలితాలు ఇలాగే కొనసాగితే వైసీపీకీ 25 స్థానాలు దక్కడం కూడా కష్టమే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







