OPEC+ ఉత్పత్తి కోతలు పొడిగింపు
- June 04, 2024
రియాద్: పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (OPEC) మరియు దాని మిత్రదేశాలు, సమిష్టిగా OPEC+ అని పిలుస్తారు.2025 చివరి వరకు రోజుకు 2.2 మిలియన్ బ్యారెళ్ల స్వచ్ఛంద ఉత్పత్తి కోతలను పొడిగించడానికి అంగీకరించాయి. ఈ మేరకు OPEC ఒక పత్రికా ప్రకటనలో ప్రకటించింది. ఉత్పత్తిని పర్యవేక్షించడానికి జాయింట్ మినిస్టీరియల్ మానిటరింగ్ కమిటీ (JMMC) ప్రతి రెండు నెలలకోసారి సమావేశమవుతుంది. రష్యా నేతృత్వంలోని OPEC మరియు మిత్రదేశాలను కలిగి ఉన్న కూటమి 2022 చివరి నుండి గణనీయమైన ఉత్పత్తి కోతలను అమలు చేస్తుంది. ప్రస్తుతం, మొత్తం కోతలు రోజుకు 5.86 మిలియన్ బ్యారెల్స్గా ఉన్నాయి. ఇది ప్రపంచ డిమాండ్లో దాదాపు 5.7% నికి సమానం. ఈ కోతల్లో 2024 చివరి వరకు OPEC+ సభ్యుల నుండి రోజుకు 3.66 మిలియన్ బ్యారెల్స్ ఉన్నాయి. 2025లో రోజుకు 3.519 మిలియన్ బ్యారెల్స్కు పెరుగుతుంది. ఈ పెరుగుదల జనవరి నుండి సెప్టెంబరు 2025 చివరి వరకు దశలవారీగా అమలు చేయనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







