రేవ్ పార్టీ కేసులో నటి హేమకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
- June 04, 2024
బెంగళూరు: బెంగుళూర్ రేవ్ పార్టీ లో పోలీసులకు అడ్డంగా దొరికిన టాలీవుడ్ నటి హేమకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్ట్. ఈ కేసులో సోమవారం హేమను అరెస్ట్ చేసిన బెంగుళూరు సీసీబీ పోలీసులు వైద్య పరీక్షల అనంతరం రాత్రి ఆమెను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. దీంతో హేమకు మేజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు ఆమెను జైలుకు తరలించారు.
గత నెల 20వ తేదీన బెంగుళూరులోని ఓ ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీకి నటి హేమతో పాటు టాలీవుడ్కు చెందిన పలువురు నటులు హాజరైన విషయం తెలిసిందే. ఈ పార్టీకి సంబంధించి దాదాపు 150 మందిపై సీసీబీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో డ్రగ్స్ సేవించారన్న అనుమానంతో 103 మంది నుండి బ్లడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపారు. వీరిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్థారణ అయ్యింది. హేమ కూడా ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో విచారణకు హాజరు కావాలని పోలీసులు హేమకు రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. వివిధ కారణాలతో రెండు సార్లు పోలీసుల దర్యాప్తుకు హేమ హాజరుకాలేదు. దీంతో మరోసారి పోలీసులు ఆమెకు నోటీసులు ఇవ్వగా.. మూడోసారి హాజరయ్యారు. విచారణ అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- ఒమన్ లో ప్లాస్టిక్ పై నిషేధం..జూలై 1 నుండి ఐదవ దశ ప్రారంభం..!!
- సముద్రయానం ముప్పు..సౌదీ, ఈజిప్ట్, ఖతార్ చర్చలు..!!
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక







