పూర్తిగా తప్పిన వేణు స్వామి జ్యోతిష్యం..
- June 04, 2024
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ కాంట్రవర్శియల్ జ్యోతిష్యుడు ఎవరు అంటే తొలుత చెప్పే పేరు వేణు స్వామి. సినిమా సెలబ్రిటీల గురించి, రాజకీయ నాయకుల గురించి ఆయన ప్రిడిక్షన్స్ నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ఆయన జ్యోతిష్యాలు తప్పైనప్పుడు నెట్టింట ట్రోల్స్ కూడా గట్టిగానే కనిపిస్తాయి. ఇక ఏపీలో మరోసారి జగన్ సీఎం అవుతారంటూ.. ఇటీవల ఆయన చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. ఏపీలో మరోసారి సీఎం జగనే అంటూ పలు సందర్భాల్లో వాఖ్యానించిన వేణు స్వామి.. తాజాగా వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందో కూడా తెలిపారు. ఏపీలో జగన్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని వేణు స్వామి కుండబద్దలు కొట్టేశారు. 79 సీట్లలలో వైసీపీ వన్ సైడ్గా గెలుస్తుందని.. 30 నుంచి 40 సీట్లలలో టఫ్ ఫైట్ ఉంటుందని వేణు స్వామి తెలిపారు. 95 సీట్ల నుంచి 125 సీట్ల వరకు వైసీపీ విజయం సాధించే అవకాశాలున్నాయని వేణు స్వామి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా 2029 ఎన్నికల్లో కూడా గెలిచి జగన్ హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టిస్తారని వేణు స్వామి తెలిపారు.
అయితే.. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలు వేణుస్వామి చెప్పిన దానికి పూర్తిగా భిన్నంగా ఉండటం గమనార్హం. దాదాపుగా కూటమి క్లీన్ స్వీప్ చేసింది. దీంతో చేసేదేం లేక తాను చెప్పిన జాతకం తప్పైంది అంటూ ఆయన సీన్లోకి వచ్చారు. తన విద్వత్తు, నాలెడ్జ్ ఉపయోగించి.. జాతకాన్ని బేస్ చేసుకుని.. జగన్ గురించి జ్యోతిష్యం చెప్పానని.. అది 100 శాతం తప్పైందని ఒప్పుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







