లోక్సభ ఎన్నికల్లో రికార్డు.. 7.8లక్షల ఓట్ల ఆధిక్యంలో ఇండోర్ అభ్యర్థి
- June 04, 2024
మధ్యప్రదేశ్: లోక్సభ ఎన్నికల్ ఓట్ల ప్రక్రియ కొనసాగుతోంది. అబ్ కీ బార్ చార్ సౌ పార్ అన్న ఎన్డీఏ నినాదం నినాదంలానే మిగిలిపోతోంది. బీజేపీ కూటమికి ఇండియా కూటమి గట్టిగా పోటీనిస్తోంది.
పలు నియోజకవర్గాల్లో రికార్డు మెజార్టీలు సాధిస్తోంది.మరో వైపు సీట్లు తగ్గినా.. బీజేపీ కూడా చాలా నియోజకవర్గాల్లో భారీ మెజార్టీలు సొంతం చేసుకుంది. లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇండోర్లో భారీ మెజార్టీ నమోదయింది.
ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి శంకర్ లల్వాని సరికొత్త రికార్డు దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఆయన 7,89,625 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో నామినేషన్ వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. లోక్సభ చరిత్రలో ఇప్పటివరకు బీజేపీ నాయకురాలు ప్రీతమ్ ముండే పేరుతో అత్యధిక మెజార్టీ రికార్డు (6.9లక్షలు) ఉండగా.. శంకర్ లల్వానీ దాన్ని అధిగమించారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









