మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయనున్న ఎన్డీఏ నేతలు..
- June 07, 2024
న్యూ ఢిల్లీ: ఎన్డీఏకు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఆ కూటమి నేతలు ఇవాళ ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. ఇందుకోసం పాత పార్లమెంటు భవనంలో ఎన్డీఏ ఎంపీలు సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారు. ఎన్డీఏకు మద్దతిస్తున్న ఎంపీల జాబితాను రాష్ట్రపతికి ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరతారు.
ఇవాళ ఎన్డీఏ నేతల సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. 543 స్థానాలున్న లోక్సభలో ఎన్డీఏ ఈ ఎన్నికల్లో మొత్తం 293 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 272 మార్కును సాధించలేదు.
బీజేపీ ఈ సారి 240 సీట్లను మాత్రమే గెలుచుకుంది. దీంతో ఏపీలో 16 సీట్లు గెలుచుకున్న టీడీపీ కేంద్ర సర్కారులో కీలకంగా మారుతోంది. బిహార్ సీఎం నితీశ్ కుమార్కు చెందిన జేడీయూ (12 సీట్లు), ఏక్నాథ్ షిండే శివసేన (7), చిరాగ్ పాశ్వాన్కి చెందిన లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ (7) కూడా కేంద్ర సర్కారు ఏర్పాటులో కీలకంగా మారాయి.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







