జూన్ 13లోగా క్షమాభిక్ష ప్రక్రియ పూర్తి చేసుకోండి.. ఎంబసీ
- June 07, 2024
కువైట్: కువైట్లో రాబోయే ఈద్ అల్ అదా సెలవుల నేపథ్యంలో చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ లేని భారతీయ పౌరులందరూ జూన్ 13వ తేదీలోగా క్షమాభిక్ష విధానాలను పూర్తి చేయాలని భారత రాయబార కార్యాలయం కోరింది. చట్టపరమైన పత్రాలు లేని ప్రవాసులకు కువైట్ క్షమాభిక్షను ప్రకటించింది. వారు తమ స్థితిని సరిదిద్దడానికి లేదా జరిమానా చెల్లించకుండా దేశం విడిచి వెళ్ళడానికి వీలు కల్పిస్తుంది. ఈ క్షమాభిక్ష జూన్ 17తో ముగుస్తుంది. అయితే, జూన్ 14 నుండి ఈద్ అల్ అదా కోసం మంత్రిత్వ శాఖ కార్యాలయాలు, రాయబార కార్యాలయాలకు సెలవు. ఈ నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశానికి తిరిగి రావాలనుకునే వారు జూన్ 13 లోపు ఏదైనా ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







