యూఎస్ఏ ఎంబసీపై దాడిని ఖండించిన యూఏఈ
- June 07, 2024
యూఏఈ: బీరుట్లోని యుఎస్ ఎంబసీని లక్ష్యంగా చేసుకున్న దాడిని యూఏఈ తీవ్రంగా ఖండించింది.ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. జూన్ 5న మిషన్ సమీపంలో కాల్పులు జరిగాయి. అనంతరం దీనికి బాధ్యుడిగా భావిస్తున్న ఒక సిరియన్ వ్యక్తిని అరెస్టు చేసారు. అనంతరం లెబనీస్ ఆర్మీ బలగాలు బీరుట్లోని అమెరికా రాయబార కార్యాలయం దగ్గర గట్టి భద్రతను ఏర్పాటు చేసాయి. అంతర్జాతీయ చట్టం ప్రకారం దౌత్య భవనాలను రక్షించే ప్రాముఖ్యతను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో గుర్తుచేసింది. భద్రత మరియు స్థిరత్వాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో అన్ని రకాల హింస, ఉగ్రవాదానికి తమ దేశం వ్యతిరేకమని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







