యూఎస్ఏ ఎంబసీపై దాడిని ఖండించిన యూఏఈ

- June 07, 2024 , by Maagulf
యూఎస్ఏ ఎంబసీపై దాడిని ఖండించిన యూఏఈ

యూఏఈ: బీరుట్‌లోని యుఎస్ ఎంబసీని లక్ష్యంగా చేసుకున్న దాడిని యూఏఈ తీవ్రంగా ఖండించింది.ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. జూన్ 5న మిషన్ సమీపంలో కాల్పులు జరిగాయి. అనంతరం దీనికి బాధ్యుడిగా భావిస్తున్న ఒక సిరియన్ వ్యక్తిని అరెస్టు చేసారు. అనంతరం లెబనీస్ ఆర్మీ బలగాలు బీరుట్‌లోని అమెరికా రాయబార కార్యాలయం దగ్గర గట్టి భద్రతను ఏర్పాటు చేసాయి.  అంతర్జాతీయ చట్టం ప్రకారం దౌత్య భవనాలను రక్షించే ప్రాముఖ్యతను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో గుర్తుచేసింది.  భద్రత మరియు స్థిరత్వాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో అన్ని రకాల హింస, ఉగ్రవాదానికి తమ దేశం వ్యతిరేకమని స్పష్టం చేసింది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com