అబుధాబిలో కేరళ మహిళ మృతి...
- June 08, 2024
అబుధాబి: కేరళకు చెందిన మహిళ అబుధాబిలో శవమై కనిపించింది.భర్త పరిస్థితి విషమంగా ఉంది.అయితే ఇది హత్య లేక ఆత్మహత్య అనేది తెలియరాలేదు.వివరాల్లోకి వెళితే..కేరళలోని కన్నూర్ చిరక్కల్ మడత్తుకుండి పరప్పురానికి చెందిన మనోగ్నకు లినెక్తో 2021 ఏప్రిల్ 17న వివాహం జరిగింది. ఉన్నతంగా బతకాలన్న ఉద్దేశంతో ఏడాదిన్నర క్రితం అబుదాబీకి వచ్చారు. మనోగ్న వెబ్ డెవలపర్గా పనిచేస్తుంది.లినెక్ ఒక కంపెనీలో సేల్స్ మేనేజర్గా వ్యవహరిస్తున్నాడు.అయితే ఆదివారం నుండి భార్యా భర్తలిద్దరూ ఫోన్లకు స్పందించడం లేదు. దీంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు.ఏం జరిగిందో చూడాలంటూ అబుధాబిలో ఉన్న బంధువులకు సమాచారం అందించారు.
రెండు రోజుల తర్వాత దంపతులు నివసిస్తున్న ఇంటికి వెళ్లి చూడగా..మనోగ్న నరాలు తెగిపోయి కనిపించింది. అలాగే భర్తకు కూడా అదే స్థితిలో ఉన్నాడు. అతడు మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కాగా, ఇద్దరు ఆత్మహత్యకు యత్నించారని తెలుస్తుంది. అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది ముమ్మాటికి హత్యే అని ఆ అమ్మాయి తరుఫు బంధువులు ఆరోపిస్తున్నారు. ఆదివారం రాత్రి వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు ఉందని స్థానికులు అనుమానిస్తున్నారు. వారి ఇంటి నుండి శబ్దాలు, అరుపులు వినిపించాయని అంటున్నారు. అతడే ఆమెను హత్య చేసి..ఆ పై అతడు నరం కట్ చేసుకుని ఉంటాడన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు భారత ఎంబసీ సాయాన్ని కోరారు కుటుంబ సభ్యులు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







