దుక్మ్ లో పెట్టుబడులకు ఆకర్షణీయమైన వాతావరణం..!
- June 09, 2024
దుక్మ్: పెట్టుబడులకు ఆకర్షణీయమైన వాతావరణాన్ని సృష్టించడం కోసం విద్యుత్, నీరు సహా అన్ని సేవలను అందించే వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు ప్రత్యేక ఆర్థిక మండలి దుక్మ్ వెల్లడించింది. స్పెషల్ ఎకనామిక్ జోన్, డుక్మ్లోని టెక్నికల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అబ్దుల్లా బిన్ సలీమ్ అల్ హకమానీ మాట్లాడుతూ.. స్పెషల్ ఎకనామిక్ జోన్లు, ఫ్రీ జోన్ల కోసం పబ్లిక్ అథారిటీ భారీ, మధ్యస్థ మరియు నిర్దేశించిన ప్రాంతాలలో రోడ్ ప్రాజెక్ట్లు మరియు సేవలను అమలు చేయడానికి అద్భుతమైన కృషి చేస్తోందన్నారు. స్పెషల్ ఎకనామిక్ జోన్.. దుక్మ్ వద్ద 200 కిలోమీటర్ల పొడవున ప్రధాన మరియు అంతర్గత రోడ్ల నెట్వర్క్ను ప్లాన్ చేసినట్లు ఆయన చెప్పారు. చేపల పరిశ్రమల కోసం నిర్దేశించిన ప్రాంతంలోని రహదారుల నిర్మాణ పనులు ప్రస్తుత సంవత్సరం చివరి నాటికి పూర్తవుతాయని పేర్కొన్నారు. సోలార్ మరియు విండ్ క్లీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై ఇప్పటివరకు ఏడు ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, ఈ ప్రాజెక్టుల పెట్టుబడి విలువ 30 మిలియన్ డాలర్లకు పైగా ఉందని, ప్రాజెక్టుల ద్వారా 1 మిలియన్ టన్నులు ఉత్పత్తి అవుతుందని ఆయన అన్నారు. పబ్లిక్ అథారిటీ ఫర్ స్పెషల్ ఎకనామిక్ జోన్.. దుక్మ్ ప్రస్తుతం OMR73 మిలియన్లకు పైగా ఖర్చుతో 15 కిలోమీటర్ల పొడవున “నేషనల్ రోడ్ 32” ప్రాజెక్ట్ యొక్క ‘ఫేజ్ 1’ని అమలు చేస్తోంది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







