దుక్మ్ లో పెట్టుబడులకు ఆకర్షణీయమైన వాతావరణం..!
- June 09, 2024
దుక్మ్: పెట్టుబడులకు ఆకర్షణీయమైన వాతావరణాన్ని సృష్టించడం కోసం విద్యుత్, నీరు సహా అన్ని సేవలను అందించే వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు ప్రత్యేక ఆర్థిక మండలి దుక్మ్ వెల్లడించింది. స్పెషల్ ఎకనామిక్ జోన్, డుక్మ్లోని టెక్నికల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అబ్దుల్లా బిన్ సలీమ్ అల్ హకమానీ మాట్లాడుతూ.. స్పెషల్ ఎకనామిక్ జోన్లు, ఫ్రీ జోన్ల కోసం పబ్లిక్ అథారిటీ భారీ, మధ్యస్థ మరియు నిర్దేశించిన ప్రాంతాలలో రోడ్ ప్రాజెక్ట్లు మరియు సేవలను అమలు చేయడానికి అద్భుతమైన కృషి చేస్తోందన్నారు. స్పెషల్ ఎకనామిక్ జోన్.. దుక్మ్ వద్ద 200 కిలోమీటర్ల పొడవున ప్రధాన మరియు అంతర్గత రోడ్ల నెట్వర్క్ను ప్లాన్ చేసినట్లు ఆయన చెప్పారు. చేపల పరిశ్రమల కోసం నిర్దేశించిన ప్రాంతంలోని రహదారుల నిర్మాణ పనులు ప్రస్తుత సంవత్సరం చివరి నాటికి పూర్తవుతాయని పేర్కొన్నారు. సోలార్ మరియు విండ్ క్లీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై ఇప్పటివరకు ఏడు ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, ఈ ప్రాజెక్టుల పెట్టుబడి విలువ 30 మిలియన్ డాలర్లకు పైగా ఉందని, ప్రాజెక్టుల ద్వారా 1 మిలియన్ టన్నులు ఉత్పత్తి అవుతుందని ఆయన అన్నారు. పబ్లిక్ అథారిటీ ఫర్ స్పెషల్ ఎకనామిక్ జోన్.. దుక్మ్ ప్రస్తుతం OMR73 మిలియన్లకు పైగా ఖర్చుతో 15 కిలోమీటర్ల పొడవున “నేషనల్ రోడ్ 32” ప్రాజెక్ట్ యొక్క ‘ఫేజ్ 1’ని అమలు చేస్తోంది.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







