200 మంది కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు
- June 11, 2024
దుబాయ్: మొబైల్ క్లినిక్లో 200 మందికి పైగా బ్లూ కాలర్ కార్మికులు ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. 'వెల్నెస్ ఆన్ వీల్స్' దుబాయ్ ఆధారిత విశ్వవిద్యాలయం ప్రత్యేక విద్యా ప్రాజెక్టులో భాగంగా దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్ (డిఐపి) 2లోని నాఫ్కో క్యాంప్ 9కి చేరుకుంది. జార్జ్టౌన్ విశ్వవిద్యాలయం నుండి ఎగ్జిక్యూటివ్ MBA ప్రోగ్రామ్ విద్యార్థులు 'ఎథిక్స్ మాడ్యూల్' అనే ఎడ్యుకేషనల్ మాడ్యూల్ కోసం ఆరోగ్య సంరక్షణ రంగం నుండి వివిధ అధికారులతో కలిసి పనిచేస్తున్నారు. మొబైల్ క్లినిక్కు హాజరైన ఎనిమిది మంది వైద్యులలో ఒకరైన దుబాయ్ హెల్త్కు చెందిన డాక్టర్ డైయల్షామ్ మాట్లాడుతూ..కార్మికుల అనారోగ్యాల లక్షణాలను గుర్తించడంపై తాము ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు. అనంతరం లైఫ్ ఫార్మసీ అందించిన ఎలక్ట్రోలైట్స్, విటమిన్లు మరియు హైడ్రేషన్ ప్యాక్లు వంటి అవసరమైన సప్లిమెంట్లను కార్మికులకు పంపిణీ చేశారు. అరబిక్, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, బెంగాలీ మరియు తగలోగ్ అనే ఆరు వేర్వేరు భాషల్లో ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని కార్మికులకు అవగాహన కల్పించారు.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







