200 మంది కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు
- June 11, 2024
దుబాయ్: మొబైల్ క్లినిక్లో 200 మందికి పైగా బ్లూ కాలర్ కార్మికులు ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. 'వెల్నెస్ ఆన్ వీల్స్' దుబాయ్ ఆధారిత విశ్వవిద్యాలయం ప్రత్యేక విద్యా ప్రాజెక్టులో భాగంగా దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్ (డిఐపి) 2లోని నాఫ్కో క్యాంప్ 9కి చేరుకుంది. జార్జ్టౌన్ విశ్వవిద్యాలయం నుండి ఎగ్జిక్యూటివ్ MBA ప్రోగ్రామ్ విద్యార్థులు 'ఎథిక్స్ మాడ్యూల్' అనే ఎడ్యుకేషనల్ మాడ్యూల్ కోసం ఆరోగ్య సంరక్షణ రంగం నుండి వివిధ అధికారులతో కలిసి పనిచేస్తున్నారు. మొబైల్ క్లినిక్కు హాజరైన ఎనిమిది మంది వైద్యులలో ఒకరైన దుబాయ్ హెల్త్కు చెందిన డాక్టర్ డైయల్షామ్ మాట్లాడుతూ..కార్మికుల అనారోగ్యాల లక్షణాలను గుర్తించడంపై తాము ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు. అనంతరం లైఫ్ ఫార్మసీ అందించిన ఎలక్ట్రోలైట్స్, విటమిన్లు మరియు హైడ్రేషన్ ప్యాక్లు వంటి అవసరమైన సప్లిమెంట్లను కార్మికులకు పంపిణీ చేశారు. అరబిక్, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, బెంగాలీ మరియు తగలోగ్ అనే ఆరు వేర్వేరు భాషల్లో ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని కార్మికులకు అవగాహన కల్పించారు.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







