జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఏకగ్రీవ ఎన్నిక
- June 11, 2024
అమరావతి: జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా ఆ పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ను జనసేన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ కల్యాణ్ పేరును ప్రతిపాదించారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా కలిసి పోటీచేసిన విషయం తెలిసిందే. కూటమిలో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థులు 21 నియోజకవర్గాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లో విజయం సాధించారు. ఎన్నికల్లో పోటీచేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి వంద శాతం స్ట్రైక్ రేటు కలిగిన పార్టీగా జనసేన పార్టీ రికార్డును క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఏపీలో అత్యధిక ఎమ్మెల్యేలు కలిగినఉన్న పార్టీగా టీడీపీ తరువాత జనసేన రెండో స్థానంలో నిలిచింది. వైసీపీ నుండి కేవలం 11 మంది అభ్యర్థులు మాత్రమే విజయం సాధించారు.
తాజా వార్తలు
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు







