ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్
- June 11, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు మంగళవారం చంద్రబాబును శాసన సభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్కు అందించి.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కూటమి నేతల తీర్మానాన్ని పరిశీలించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్తో చంద్రబాబు భేటీ అయ్యారు.
గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బుధవారం ఉదయం 11.24 గంటలకు అమరావతిలోని కేసరవల్లి ఐటీ పార్క్ దగ్గర చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అమిత్ షా, చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి బండి సంజయ్ మరి కొందరు ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
తాజా వార్తలు
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!
- వింటర్ ట్రావెల్ ఇల్నెస్..డాక్టర్స్ వార్న్..!!
- మస్కట్ లో సునామీ పై మూడు రోజుల క్యాంపెయిన్..!!
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం







