ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్
- June 11, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు మంగళవారం చంద్రబాబును శాసన సభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్కు అందించి.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కూటమి నేతల తీర్మానాన్ని పరిశీలించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్తో చంద్రబాబు భేటీ అయ్యారు.
గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బుధవారం ఉదయం 11.24 గంటలకు అమరావతిలోని కేసరవల్లి ఐటీ పార్క్ దగ్గర చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అమిత్ షా, చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి బండి సంజయ్ మరి కొందరు ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
తాజా వార్తలు
- భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత..
- సింహాచలం: మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
- కోల్కతాలో విషాద ఘటన..14 మంది మృతి..
- దుబాయ్ అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం..!!
- ప్రపంచ ఆరోగ్య సర్వే 2025 ను ప్రారంభించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ..!!
- తుమామా స్టేడియం దగ్గర ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- 16 నకిలీ సోషల్ మీడియా ఖాతాలు.. నిందితుడి అరెస్టు..!!
- 2025 మొదటి 3 నెలల్లో.. 42 మిలియన్ల దిర్హామ్లకు పైగా ఫేక్ వస్తువులు సీజ్..!!
- ఇండియన్ ఎయిర్ స్పేస్ బంద్!