ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్
- June 11, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు మంగళవారం చంద్రబాబును శాసన సభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్కు అందించి.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కూటమి నేతల తీర్మానాన్ని పరిశీలించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్తో చంద్రబాబు భేటీ అయ్యారు.
గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బుధవారం ఉదయం 11.24 గంటలకు అమరావతిలోని కేసరవల్లి ఐటీ పార్క్ దగ్గర చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అమిత్ షా, చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి బండి సంజయ్ మరి కొందరు ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







