భారత ఆర్థిక పురోభివృద్ధిలో యువతదే కీలకపాత్ర: తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్

- June 11, 2024 , by Maagulf
భారత ఆర్థిక పురోభివృద్ధిలో యువతదే కీలకపాత్ర:  తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్
హైదరాబాద్: తెలంగాణ మరియు జార్ఖాండ్ గవర్నరు, మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరు సి.పి. రాధాకృష్ణన్ ఈరోజు సిద్దిపేట జిల్లా ములుగు లో జరిగిన కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం మూడో స్నాతకోత్సవాన్ని ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల స్థూల జాతీయోత్పత్తిగా ఎదిగేందుకు భారత్ కు పుష్కల అవకాశాలు ఉన్నాయని, ఇది వికసిత్ భారత్ ద్వారా సాధ్యం అవుతుందని, అందులో యువత ప్రముఖ పాత్ర పోషించాలని అన్నారు. 
 
భారత స్థూల జాతీయోత్పత్తికి 18% పైగా వ్యవసాయమే ఆధారమైన నేపథ్యంలో మరింత వృద్ధిరేటుకై ప్రభుత్వం సహజ, సేంద్రియ వ్యవసాయానికి మరింత మద్దతునిస్తుందని తెలిపారు.వ్యవసాయంతోపాటు ఉద్యాన అటవీ రంగాలకు  ప్రాధాన్యత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో 70% పైగా గ్రామీణులకు ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయమే అని,  82 శాతం పైగా చిన్న సన్నకారు రైతులే అని పేర్కొన్నారు. 
 
విద్యార్థులు విజయమే ధ్యేయంగా ముందుకు సాగాలని కష్టాలు ఎదురైతే విరామం ఇవ్వచ్చు కానీ వెనుక తిరిగొద్దని గవర్నర్ పిలుపునిచ్చారు. పెద్దగా ఆలోచించాలని వాటిని చేరుకునేందుకు ఆరంభం సైతం చేరువ అంతే పెద్దగా ఉండాలని అన్నారు. ప్రపంచంలో అబ్రహం లింకన్, నరేంద్ర మోడీ ప్రపంచంలో తనదైన ముద్ర వేశారని, పేదరికం ఆకలి బాధతో కొట్టుమిట్టాడుతున్న జనాలకు వాటి నుంచి  విముక్తి కల్పించిన గొప్ప వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ అని గవర్నర్ పేర్కొన్నారు. చదువుతో సహా ప్రతి అంశంలో నాణ్యతను చూపించినట్టయితే విజయం తధ్యమని అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయని తెలిపారు.  విద్యలో నాణ్యతను పెంపొందించేందుకు రాజ్ భవన్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుందని ఈ సందర్భంగా గవర్నర్ తెలిపారు.
 
విద్యార్థులకు బంగారు పతకాల ప్రధానం: 
బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్  లో అత్యధిక ఓజిపిఏ సాధించినందుకు గాను 2023 బ్యాచ్ కు చెందిన  ఆర్. వరలక్ష్మి మూడు బంగారు పతకాలు అందుకున్నారు. బిఎస్సి హానర్స్ ఫారెస్ట్రీలో పిసిసిఎఫ్ గోల్డ్ మెడల్ కె. రవళి; deans గోల్డ్ మెడల్ కె. ప్రత్యూష అందుకున్నారు. ఎమ్మెస్సీ హార్టికల్చర్ లో అన్ని విభాగాల్లో అత్యధిక మార్కులు సాధించినందుకు గాను ఎస్కేఎల్ టి ఎస్ హెచ్ గోల్డ్ మెడల్, అలాగే  విద్యార్థినిలలో అత్యధిక మార్కులు సాధించినందుకు గాను, ఇంకా కూరగాయల విభాగంలో టాపర్గా నిలిచినందుకుగాను  గాను ఎం.మాళవిక మూడు గోల్డ్ మెడల్స్ కైవసం చేసుకున్నారు. పండ్ల శాస్త్ర విభాగంలో జిఎస్ దివ్య, పూల శాస్త్ర విభాగంలో పీ. విద్య శ్రీ, అలాగే  ఔషధ, సుగంధ ద్రవ్య పంటల విభాగంలో పి.మహేశ్వరి గోల్డ్ మెడల్స్ అందుకున్నారు. 
 
విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రధానం: 
ఈ మూడవ స్నాతకోత్సవంలో 156 మంది కి ఉద్యాన డిగ్రీ, 50 మందికి ఫారెస్ట్ డిగ్రీ, 45 మందికి ఉద్యాన పీజీ, 30 మంది ఫారెస్ట్ పీజీ, అలాగే మరో ఆర్గుకి పీహెచ్డ్ డాక్టరేట్ పట్టాలు ప్రధానం .
 
కార్యక్రమంలో తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి.గీతాలక్ష్మి  స్నాతకోత్వానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్ శ్రీమతి బి. నీరజ ప్రభాకర్, వర్సిటీ registrar డాక్టర్ ఏ భగవాన్, డీన్ డాక్టర్ ఎం. రాజశేఖర్, పరిశోధన సంచాలకులు డాక్టర్ కిరణ్, డిఎస్ఏ డాక్టర్ విజయ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ శ్రీనివాసన్, ఉద్యాన శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి, బోర్డు మెంబర్ డాక్టర్ ఆర్కే మాథూర్, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. 
 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com