13న బాధ్యతలు స్వీకరించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- June 11, 2024
న్యూ ఢిల్లీ: తెలంగాణ బీజేపీ చీఫ్, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి మోడీ 3.0 కేబినెట్లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. మోడీ 2.0 మంత్రి మండలిలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా పని చేసిన కిషన్ రెడ్డికి మోడీ 3.0 కేబినెట్ లో కేంద్ర బొగ్గు, గనుల మంత్రిగా ఛాన్స్ దక్కింది.
కేంద్ర మంత్రిగా ప్రధాని మోడీతో పాటే ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు కిషన్ రెడ్డి. మంత్రిగా ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు.
ఈ క్రమంలో కిషన్ రెడ్డి బొగ్గు, గనుల మంత్రిగా చార్జ్ తీసుకునేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 13న ఉదయం 11 గంటలకు కిషన్ రెడ్డి బొగ్గు, గనుల మంత్రిత్వశాఖ బాధ్యతలు తీసుకోనున్నారు. కాగా, మోడీ 3.0 కేబినెట్లో తెలంగాణ నుండి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కింది. కిషన్ రెడ్డికి కేబినెట్ హోదాతో మంత్రి దక్కగా.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు హోం శాఖ సహాయ మంత్రి పోస్ట్ లభించింది.
తాజా వార్తలు
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!
- వింటర్ ట్రావెల్ ఇల్నెస్..డాక్టర్స్ వార్న్..!!







