టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు..
- June 14, 2024
అమరావతి: ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రిగా నియమితులు కావడంతో అచ్చెన్నాయుడు స్థానంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావును పార్టీ అధిష్ఠానం నేడు నియమించింది. దీనిపై పల్లా శ్రీనివాసరావు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
“తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, యువనేత నారా లోకేశ్ కు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులకు కృతజ్ఞతలు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధ్యక్షుడిగా తన బాధ్యతలు సమర్థంగా నిర్వహించి, పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన అచ్చెన్నాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను వెన్నుతట్టి నడిపిస్తున్న కార్యకర్తలకు, గాజువాక ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను” అంటూ పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









