టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు..

- June 14, 2024 , by Maagulf
టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు..

అమరావతి: ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రిగా నియమితులు కావడంతో అచ్చెన్నాయుడు స్థానంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావును పార్టీ అధిష్ఠానం నేడు నియమించింది. దీనిపై పల్లా శ్రీనివాసరావు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

“తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, యువనేత నారా లోకేశ్ కు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులకు కృతజ్ఞతలు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధ్యక్షుడిగా తన బాధ్యతలు సమర్థంగా నిర్వహించి, పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన అచ్చెన్నాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను వెన్నుతట్టి నడిపిస్తున్న కార్యకర్తలకు, గాజువాక ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను” అంటూ పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com