కఫం లేదా శ్లేష్మం నుంచి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటించండి.!
- June 21, 2024
తీవ్రమైన జలుబు, దగ్గు చేసినప్పుడు గొంతులో శ్లేష్మం పేరుకుపోతుంది. దీన్ని లైట్ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. మందుల ద్వారా కన్నా.. ఈ కఫం లేదా శ్లేష్మాన్ని సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారానే తొలగించుకోవడం వుత్తమం.
ముందుగా వాటర్ ఎక్కువగా తాగడం వల్ల శ్లేష్మం పలచబడి స్వేధం లేదా మూత్రం ద్వారా బయటికి వచ్చేస్తుంది. అలాగే, వేడి వేడిగా వుండే సూప్స్ లేదా గ్రీన్ టీ వంటి లిక్విడ్స్ తీసుకోవడం ద్వారా కూడా శ్లేష్మం కరుగుతుంది.
పిప్పరమెంట్ టీ.. గ్రీన్ టీ మాదిరి మార్కెట్లో అందుబాటులో వుంటుంది. ఈ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు.. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శ్లేష్మం పెరగనివ్వకుండా చేస్తాయ్.
పసుపు కలిపిన వేడి వేడి పాలను తీసుకోవడం వల్ల కూడా శ్లేష్మం నుంచి ఉపశమనం పొందొచ్చు. ఓ గ్లాసుడు పాలలో చిటికెడు పసుపు వేసి, ఓ స్పూన్ తేనె, మెత్తగా నూరిన నల్ల మిరియాల పొడి కలిపి తీసుకుంటే, మంచి ఉపశమనం లభిస్తుంది.
శ్లేష్మం దానంతట అదే తగ్గిపోతుందిలే.. అనుకుంటే అది ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాస సంబంధిత సమస్యలకు దారి తీయొచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కూడా కావచ్చు. సో, శ్లేష్మాన్ని, కఫాన్ని అస్సలు అశ్రద్ధ చేయరాదని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







