ఎన్టీయార్ - ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటంటే.!
- June 21, 2024
‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్తో ఎన్టీయార్ ఓ సినిమా చేయాల్సి వుంది. ‘కేజీఎఫ్’ తర్వాత ‘సలార్’ సినిమాతో ప్రశాంత్ నీల్ బిజీగా వుండడం ఇంతవరకూ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.
ప్రస్తుతం ఎన్టీయార్.. ఓ వైపు ‘దేవర’ సినిమాతోనూ, మరోవైపు బాలీవుడ్ సినిమా ‘వార్ 2’తోనూ బిజీగా వున్నాడు.
తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లైన్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీయార్ తనకు అత్యంత సన్నిహితులైన కొందరు టెక్నీషియన్లతో స్క్రిప్ట్ చర్చలు జరిపిస్తున్నారనీ తెలుస్తోంది.
అన్నట్లు ఈ సినిమాకి ఓ పవర్ ఫుల్ టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. అదే ‘డ్రాగన్’. అయితే, ఈ టైటిల్పై ఇంకా క్లారిటీ లేదు కానీ, ప్రచారంలో వున్న ఈ టైటిల్ పట్ల మంచి రెస్పాన్సే వస్తోంది.
మరో ముఖ్య విషయం ఏంటంటే, ఈ సినిమాలో ఎన్టీయార్ని ఓ సరికొత్త గెటప్లో డిఫరెంట్ ఆటిట్యూడ్తో చూపించబోతున్నాడట ప్రశాంత్ నీల్. కాస్త నెగిటివ్ షేడ్స్ వున్న హీరో పాత్రనీ గుసగుసలు వినిపిస్తున్నాయ్. ప్రాజెక్ట్ ఇంకా పట్టాలెక్కకుండానే ఇన్ని ఆషక్తికరమైన గాసిప్స్ బయటికొచ్చేశాయంటే.. నిప్పు లేకుండా పొగరాదు కదా.! చూడాలి మరి.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









