యూఏఈలో 49.9°Cని తాకిన ఉష్ణోగ్రతలు
- June 22, 2024
యూఏఈ: వేసవి సీజన్లో ఇప్పటివరకు యూఏఈలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. శుక్రవారం మధ్యాహ్నం 3:15 గంటలకు, మెజైరా (అల్ దఫ్రా ప్రాంతం)లో 49.9°C ఉష్ణోగ్రత నమోదైంది, నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) X లో ఒక పోస్ట్లో తెలిపింది. అంతర్గత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 49ºC వరకు చేరుకోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. తేమ సూచిక 90 శాతానికి చేరుకుంటుందని తెలిపింది. దేశంలో అత్యంత తీవ్రమైన వేసవి దశ సాధారణంగా జూలై మధ్యలో ప్రారంభమవుతుంది. ఆగస్టు చివరి వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. తేమ 90 శాతానికి చేరుకుంటుంది. ఎడారి నుండి దుమ్ము తుఫానులు సంభవించవచ్చు. ఈ తుఫానులు నగరం అంతటా బలమైన గాలులు మరియు వేడి ఇసుక మేఘాలను తీసుకురాగలవు అని వాతావరణ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







